ఓటిటీ రిలీజ్ చేయడం ఏదో చాలా చిన్నతనం అన్నట్టు థియేటర్లు లేని ఈ సమయంలో ఓటిటీ వేదిక వాడుకుంటున్నారంటే చాలా మంది అఫెండ్ అవుతున్నారు. అనుష్క నటించిన నిశ్శబ్ధం చిత్రానికి సంబంధించి ఈ వార్తలు వస్తే ఆ టీం చాలా హర్ట్ అయింది. తమ సినిమా థియేటర్లలో మాత్రమే అంటూ నొక్కి వక్కాణించింది.
కొద్ది రోజుల క్రితం జోరు చూస్తే లాక్ డౌన్ మొత్తం ఎత్తేసి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ చేసేస్తారని భావించారు. దాంతో మరి కొద్ది రోజులు ఓపిక పడితే చాలని అనుకున్నారు. కానీ ఇప్పటి సీన్ చూస్తే ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ కాకపోవచ్చు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినా కానీ జనాలు లేక వెలవెలబోతున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసినా కానీ పరిస్థితి అదే అవుతుంది. అందుకే మరోసారి నిశ్శబ్దం ఓటిటీ కథ తెరమీదకు వచ్చింది.
ఓటిటీ ద్వారా విడుదలైన పర భాషా చిత్రాలకు స్పందన అంతగా లేకపోవడంతో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కాస్త దూకుడు తగ్గించాయి. ఇక్కడ డిమాండ్ తగ్గిపోయేలోగా ఈ దారిలో అయినా త్వరగా బయటపడాలని ఇప్పుడు తెలుగు నిర్మాతలు పలువురు తొందర పడుతున్నారు. అన్నీ కుదిరితే బహుశా త్వరలోనే నిశ్శబ్ధం వీడి శబ్దం మొదలవుతుంది.
This post was last modified on June 17, 2020 2:27 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…