ఒకప్పుడు హీరోలకి, విలన్లకి తేడా ఉండేది. అందుకే వాటిని పోషించేవారు కూడా సెపరేట్గా ఉండేవారు. కానీ ఇప్పుడు కొన్ని సినిమాల హీరోల పాత్రల్లోనే నెగిటివ్ షేడ్స్ ఉంటున్నాయి. కాబట్టి విలన్ పాత్రలు చేయడానికి కూడా హీరోలు అంతగా వెనుకాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో స్టార్ హీరోలంతా అటు హీరోలుగానూ ఇటు విలన్లుగానూ కూడా చెలామణీ అయిపోతున్నారు.
ముఖ్యంగా హీరో పాత్ర, విలన్ పాత్ర ఒకే రేంజ్లో ఉన్నప్పుడు వాటిని పోషించడానికి ఇద్దరు మహామహులు కావాలి. అలాంటప్పుడు విలన్ పాత్రధారుల్ని కాకుండా ఇద్దరినీ హీరోలనే తీసుకుంటే వచ్చే కిక్కే వేరు. అదే చేస్తున్నారు డైరెక్టర్స్. బాలీవుడ్లో అయితే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు సైఫ్ అలీ ఖాన్ బెస్ట్ చాయిస్ అవుతున్నాడు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘తానాజీ’, ప్రభాస్ చేస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రాల్లో హీరో స్టేచర్కి తగిన విలన్ కావాలి అనుకున్నప్పుడు సైఫ్నే సెలెక్ట్ చేసుకున్నారు ఆ దర్శకులు. ఇప్పుడు హృతిక్ విలన్గా నటిస్తున్న ‘విక్రమ్ వేద’ రీమేక్లో హీరో పాత్రకి సైఫ్నే తీసుకున్నారు ఈ దర్శకులు.
2017లో వచ్చిన తమిళ మూవీ ‘విక్రమ్ వేద’ చాలా పెద్ద విజయం సాధించింది. దీన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అయితే మనకంటే ముందు బాలీవుడ్ రీమేక్ మొదలైపోయింది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రిలే రీమేక్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి పోషించిన నటోరియస్ క్రిమినల్ పాత్రని హృతిక్ చేస్తున్నాడు. మాధవన్ పోషించిన సిన్సియర్ పోలీసాఫీర్ క్యారెక్టర్లో సైఫ్ నటిస్తున్నాడు.
హృతిక్ బర్త్ డే సందర్భంగా ఈమధ్యనే తన లుక్ని విడుదల చేశారు. ఇప్పుడు సైఫ్ లుక్ రిలీజయ్యింది. జీన్స్, పోలో నెక్ టీషర్ట్, గాగుల్స్తో పర్ఫెక్ట్ పోలీసాఫీర్గా కనిపిస్తున్నాడు సైఫ్. ఇంత మంచి కోస్టార్తో పని చేయడం ఆనందంగా ఉందంటూ హృతికే ఈ లుక్ని షేర్ చేశారు. లీడ్ యాక్టర్ల టెరిఫిక్ లుక్స్ని బట్టి హిందీలోనూ మూవీ అదరగొట్టే చాన్స్ ఉందనిపిస్తోంది. సెప్టెంబర్ 30 సినిమా విడుదల కానుంది.
This post was last modified on February 24, 2022 5:45 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…