ఒకప్పుడు హీరోలకి, విలన్లకి తేడా ఉండేది. అందుకే వాటిని పోషించేవారు కూడా సెపరేట్గా ఉండేవారు. కానీ ఇప్పుడు కొన్ని సినిమాల హీరోల పాత్రల్లోనే నెగిటివ్ షేడ్స్ ఉంటున్నాయి. కాబట్టి విలన్ పాత్రలు చేయడానికి కూడా హీరోలు అంతగా వెనుకాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో స్టార్ హీరోలంతా అటు హీరోలుగానూ ఇటు విలన్లుగానూ కూడా చెలామణీ అయిపోతున్నారు.
ముఖ్యంగా హీరో పాత్ర, విలన్ పాత్ర ఒకే రేంజ్లో ఉన్నప్పుడు వాటిని పోషించడానికి ఇద్దరు మహామహులు కావాలి. అలాంటప్పుడు విలన్ పాత్రధారుల్ని కాకుండా ఇద్దరినీ హీరోలనే తీసుకుంటే వచ్చే కిక్కే వేరు. అదే చేస్తున్నారు డైరెక్టర్స్. బాలీవుడ్లో అయితే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు సైఫ్ అలీ ఖాన్ బెస్ట్ చాయిస్ అవుతున్నాడు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘తానాజీ’, ప్రభాస్ చేస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రాల్లో హీరో స్టేచర్కి తగిన విలన్ కావాలి అనుకున్నప్పుడు సైఫ్నే సెలెక్ట్ చేసుకున్నారు ఆ దర్శకులు. ఇప్పుడు హృతిక్ విలన్గా నటిస్తున్న ‘విక్రమ్ వేద’ రీమేక్లో హీరో పాత్రకి సైఫ్నే తీసుకున్నారు ఈ దర్శకులు.
2017లో వచ్చిన తమిళ మూవీ ‘విక్రమ్ వేద’ చాలా పెద్ద విజయం సాధించింది. దీన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అయితే మనకంటే ముందు బాలీవుడ్ రీమేక్ మొదలైపోయింది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రిలే రీమేక్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి పోషించిన నటోరియస్ క్రిమినల్ పాత్రని హృతిక్ చేస్తున్నాడు. మాధవన్ పోషించిన సిన్సియర్ పోలీసాఫీర్ క్యారెక్టర్లో సైఫ్ నటిస్తున్నాడు.
హృతిక్ బర్త్ డే సందర్భంగా ఈమధ్యనే తన లుక్ని విడుదల చేశారు. ఇప్పుడు సైఫ్ లుక్ రిలీజయ్యింది. జీన్స్, పోలో నెక్ టీషర్ట్, గాగుల్స్తో పర్ఫెక్ట్ పోలీసాఫీర్గా కనిపిస్తున్నాడు సైఫ్. ఇంత మంచి కోస్టార్తో పని చేయడం ఆనందంగా ఉందంటూ హృతికే ఈ లుక్ని షేర్ చేశారు. లీడ్ యాక్టర్ల టెరిఫిక్ లుక్స్ని బట్టి హిందీలోనూ మూవీ అదరగొట్టే చాన్స్ ఉందనిపిస్తోంది. సెప్టెంబర్ 30 సినిమా విడుదల కానుంది.
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…