ఆలియా భట్ టైటిల్ రోల్లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయ్ కథియావాడి’ చిత్రం రేపు విడుదల కాబోతోంది. కానీ దానిపై పెట్టిన కేసులతో అసలు సినిమా బైటికి వస్తుందా రాదా అనే డైలమా కొద్ది రోజులుగా నెలకొంది. ఆ హై టెన్షన్కి కాసేపటి క్రితమే తెరపడింది. సినిమాని ఆపాల్సిన అవసరం లేదని, రిలీజ్ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై పెట్టిన కేసుల్ని కొట్టేసింది. దాంతో గంగూబాయ్కి లైన్ క్లియరైంది.
ఓ సినిమా ఎన్ని ఆపసోపాలు పడుతుందో అంతకు కొన్ని రెట్లు ఎక్కువే పడింది ‘గంగూబాయ్ కథియావాడి’. ఓ సెక్స్ వర్కర్ జీవితం ఆధారంగా తీయడం వల్లే ఇదంతా. నిజానికి గంగూబాయ్ కామాఠిపురలో అష్టకష్టాలు పడి, ఓ మాఫియా డాన్ సాయంతో ధైర్యం కూడగట్టుకుని, మాఫియా క్వీన్గా ఎదిగి, చివరికి సెక్స్ వర్కర్ల జీవితాలనే మార్చేసే స్థాయికి చేరుకుంది. ఓ రకంగా ఇది మంచి ఇన్స్పైరింగ్ స్టోరీనే. కానీ మధ్యలో కొందరు ఇంటర్ఫియర్ అవడంతో రభస స్టార్టయ్యింది.
ముఖ్యంగా తన తల్లి జీవితాన్ని వక్రీకరిస్తున్నారంటూ గంగూబాయ్ దత్తపుత్రుడు బాబూరావ్ పెద్ద గొడవే చేశాడు. కానీ అతనసలు గంగూబాయ్ కొడుకే కాదనే వాదనలు మొదలయ్యాయి. మరోవైపు సినిమాని ఆపమంటూ కామాఠిపుర మహిళలు కూడా గొడవకు దిగారు. అయితే దాన్ని కూడా కోర్టు పట్టించుకోలేదు. సినిమాని ఆపాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని, హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చని తేల్చేసింది.
కాకపోతే మూవీ టైటిల్ మార్చమని నిన్న సూచించింది. కానీ ఇవాళ తీర్పు చెప్పేటప్పుడు ఆ విషయాన్ని కోర్టు టచ్ చేయలేదని తెలిసింది. ఒక మహిళ అలాంటి బ్యాగ్రౌండ్ నుంచి రావడం తప్పేమీ కాదని, సమాజానికి ఆమె ఎంత చేసిందో చూపించడం తనని కించపర్చడం ఎలా అవుతుందని ప్రశ్నించిన భన్సాలీ తరఫు లాయర్.. ఇప్పటికే ప్రమోషన్స్ పూర్తయ్యి, సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి, రిలీజ్కి రెడీ అయిన సినిమాకి టైటిల్ మార్చడం కుదరదని వాదించాడట. దాంతో కోర్టు కూడా కన్విన్స్ అయ్యిందని సమాచారం. అది నిజమైతే గంగూబాయ్ రేపు సేమ్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకొస్తుంది. లేదంటే కాస్త మారి వచ్చే చాన్స్ ఉంది.
This post was last modified on February 24, 2022 4:02 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…