కెరీర్ ఆరంభంలో ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి చిన్న సిినిమాలు చేసి పేరు తెచ్చుకున్న దర్శకుడు మారుతి. అలాంటి సినిమాలతో కెరీర్ ఆరంభించిన దర్శకుడు ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ను డైరెక్ట్ చేయబోతుండటం అనూహ్యమైన విషయం. ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి తన స్థాయి పెంచుకున్నప్పటికీ.. ఇంత త్వరగా ప్రభాస్తో అతను జట్టు కడతాడని ఎవరూ అనుకోలేదు.
వీరి కలయికలో ‘రాజా డీలక్స్’ అనే సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందు ఇది ఊహాగానమే అనుకున్నారు కానీ.. ఈ ప్రాజెక్టు పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. ఈ వేసవిలో మూణ్నాలుగు నెలలు డేట్లు కేటాయించి చాలా వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. అతడి మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఇంకా ‘రాజా డీలక్స్’ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదన్న మాటే కానీ.. సినిమా పనులు మాత్రం వేగంగా జరిగిపోతున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు చివరి దశలో ఉండగా.. మరోవైపు ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందట. ‘రాజా డీలక్స్’ కోసం భారీగా సెట్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నేతృత్వంలో హైదరాబాద్లో ఈ సెట్లను నిర్మిస్తున్నారట. ఔట్ డోర్ వెళ్లకుండా సెట్స్లోనే మెజారిటీ సన్నివేశాలను వేగంగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మారుతి మామూలుగా తక్కువ బడ్జెట్లో సినిమాలు లాగించేస్తుంటాడు. కానీ ప్రభాస్ సినిమా అన్నాక భారీతనం చూపించకపోతే కష్టం. అతడి వేరే చిత్రాలతో పోలిస్తే ఖర్చు తక్కువే కానీ.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేంత భారీతనం అయితే ఇందులో ఉంటుందట. మారుతి ‘పక్కా కమర్షియల్’ సినిమాను పూర్తి చేసి పక్కన పెట్టేసి ఈ చిత్రంలో పూర్తిగా మునిగిపోయినట్లు సమాచారం.
This post was last modified on February 23, 2022 4:36 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…