కెరీర్ ఆరంభంలో ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి చిన్న సిినిమాలు చేసి పేరు తెచ్చుకున్న దర్శకుడు మారుతి. అలాంటి సినిమాలతో కెరీర్ ఆరంభించిన దర్శకుడు ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ను డైరెక్ట్ చేయబోతుండటం అనూహ్యమైన విషయం. ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి తన స్థాయి పెంచుకున్నప్పటికీ.. ఇంత త్వరగా ప్రభాస్తో అతను జట్టు కడతాడని ఎవరూ అనుకోలేదు.
వీరి కలయికలో ‘రాజా డీలక్స్’ అనే సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందు ఇది ఊహాగానమే అనుకున్నారు కానీ.. ఈ ప్రాజెక్టు పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. ఈ వేసవిలో మూణ్నాలుగు నెలలు డేట్లు కేటాయించి చాలా వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. అతడి మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఇంకా ‘రాజా డీలక్స్’ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదన్న మాటే కానీ.. సినిమా పనులు మాత్రం వేగంగా జరిగిపోతున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు చివరి దశలో ఉండగా.. మరోవైపు ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందట. ‘రాజా డీలక్స్’ కోసం భారీగా సెట్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నేతృత్వంలో హైదరాబాద్లో ఈ సెట్లను నిర్మిస్తున్నారట. ఔట్ డోర్ వెళ్లకుండా సెట్స్లోనే మెజారిటీ సన్నివేశాలను వేగంగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మారుతి మామూలుగా తక్కువ బడ్జెట్లో సినిమాలు లాగించేస్తుంటాడు. కానీ ప్రభాస్ సినిమా అన్నాక భారీతనం చూపించకపోతే కష్టం. అతడి వేరే చిత్రాలతో పోలిస్తే ఖర్చు తక్కువే కానీ.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేంత భారీతనం అయితే ఇందులో ఉంటుందట. మారుతి ‘పక్కా కమర్షియల్’ సినిమాను పూర్తి చేసి పక్కన పెట్టేసి ఈ చిత్రంలో పూర్తిగా మునిగిపోయినట్లు సమాచారం.
This post was last modified on February 23, 2022 4:36 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…