సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించింది యువి క్రియేషన్స్. కరోనా కేసులు పెరుగుతున్నా.. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిపోయినా.. తమ సినిమాను థియేటర్లలోకి దించాల్సిందే అని ఒక దశలో పట్టుదలతో ఉన్నారు. కానీ చివరికి కొవిడ్ ప్రభావం బాగా పెరిగిపోవడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని.. థియేటర్లను బుక్ చేసుకుని.. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టాక ఇలా సినిమాను వాయిదా వేసుకోవాల్సి రావడం ఎంత ఇబ్బందికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐతే కొవిడ్ కాలంలో ఇలాంటి ఇబ్బందులు మామూలైపోయాయి. అదృష్టవశాత్తూ థర్డ్ వేవ్ మరీ ఎక్కువ రోజులు కొనసాగకపోవడంతో ఇప్పుడిక మళ్లీ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 11నే రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.ఐతే ఆల్రెడీ ఫస్ట్ కాపీ తీసేశాక ఇక సినిమాను ముట్టుకోవాల్సిన పని ఉండదనే అనుకుంటారంతా.
కానీ దర్శకుడు రాధాకృష్ణకుమార్, ఎడిటర్ కలిసి మళ్లీ కత్తెరకు పని చెబుతున్నట్లు సమాచారం. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, కొన్ని చోట్ల సినిమా డ్రైగా తయారవడంతో మళ్లీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నట్లు తెలిసింది. జనవరిలో ట్రైలర్ లాంచ్ చేసినపుడు.. అది మరీ లెంగ్తీగా ఉందన్న కంప్లైంట్లు వచ్చాయి. ట్రైలరే అలా ఉంటే సినిమా సంగతేంటో అన్న కామెంట్లు కూడా వినిపించాయి.
ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడ్డాక కొందరు ప్రముఖులకు స్పెషల్ షోలు వేసి ‘రాధేశ్యామ్’ను చూపించారని.. వాళ్లు చెప్పిన సూచనల మేరకు ఎడిటింగ్ పరంగా కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. ముందు అనుకున్న దానితో పోలిస్తే తక్కువ నిడివితో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట. ప్రభాస్ ఇమేజ్కు భిన్నంగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో అన్న సందేహాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్న మాట వాస్తవం.
This post was last modified on February 23, 2022 4:03 pm
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…