కరోనా మూడో వేవ్ లేకుంటే ఈపాటికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాల థియేట్రికల్ రన్ ముగిసిపోయి ఉండేది. ఆ సినిమాల అనుభూతుల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. కానీ కొవిడ్ మరోసారి విజృంభించడంతో ఈ చిత్రాలను వాయిదా వేయక తప్పలేదు. జనవరి 7కు షెడ్యూల్ అయిన ఆర్ఆర్ఆర్, 14న రావాల్సిన ‘రాధేశ్యామ్’ చిత్రాలకు డిసెంబర్లోనే బుకింగ్స్ ఓపెన్ చేశారు ఓవర్సీస్ సెంటర్లలో. ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల అమ్మకాలు చాలా జోరుగా సాగాయి కూడా.
విడుదలకు కొన్ని వారాల ముందే ప్రి సేల్స్తో ఆ చిత్రం మిలియన్ మార్కును అందుకోవడం విశేషం. కరోనా కేసులు పెరిగాక కూడా కచ్చితంగా జనవరి 7నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఒక దశలో పట్టుదలతో ఉంది రాజమౌళి అండ్ కో. అందుక్కారణం ఓవర్సీస్లో టికెట్ల అమ్మకాలు పెద్ద ఎత్తున జరగడమే. కానీ దేశంలో కొవిడ్ పరిస్థితి అదుపు తప్పడంతో చివరికి సినిమాను వాయిదా వేయక తప్పలేదు.
దీంతో ఆ టికెట్లన్నీ క్యాన్సిల్ అయ్యాయి. రాధేశ్యామ్ పరిస్థితీ అదే అయింది.ఐతే కరోనా ప్రభావం తగ్గడంతో ఆర్ఆర్ఆర్ను మార్చి 25న, రాధేశ్యామ్ మూవీని మార్చి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డేట్లలో మార్పులేమీ లేనట్లే ప్రస్తుతానికి. దీంతో ఇక ఈ చిత్రాల ఓవర్సీస్ ప్రిమియర్స్కు రంగం సిద్ధమవుతోంది. ముందు ఒప్పందాలు చేసుకున్న సెంటర్లలో తిరిగి టికెట్ల అమ్మకాలు మొదలవుతున్నాయి. ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ టికెట్లు కొని ఇబ్బంది పడ్డ ప్రేక్షకులకు మళ్లీ పిలుపునిస్తూ ‘ఆర్ఆర్ఆర్’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తిరిగి వారిని సినిమాకు ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చారు.
విడుదలకు నెల రోజుల ముందే అక్కడ టికెట్ల అమ్మకం మొదలైపోయింది. ‘రాధేశ్యామ్’ విడుదలకు ఇంకో రెండు వారాలే ఉండటంతో దానికి కూడా ప్రి సేల్స్ మొదలైపోయాయి. ఈ మేరకు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ కూడా అప్పీల్ ఇస్తున్నాడు. యుఎస్లో మళ్లీ బాక్సాఫీస్ మంచి ఊపందుకోవడంతో ఈ చిత్రాలకు అడ్వాంటేజ్ అన్నట్లే. స్పైడర్ మ్యాన్, అన్చార్టర్డ్ సినిమాలకు వచ్చిన వసూళ్లు వాటికి ఉత్సాహాన్నిచ్చేవే.
This post was last modified on February 22, 2022 6:57 pm
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…