ఈ సారి వేసవికి సినిమాల సందడి మామూలుగా ఉండబోవట్లేదు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న తరహాలో భారీ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్-2 లాంటి పాన్ ఇండియా సినిమాలకు తోడు సర్కారు వారి పాట, ఆచార్య.. ఇలా పెద్ద సినిమాలు చాలానే అభిమానులను అలరించబోతున్నాయి. వీటికి తోడు ఎఫ్-2, అంటే సుందరానికి, పక్కా కమర్షియల్, గని, లాంటి మీడియం రేంజ్ సినిమాల హంగామా కూడా ఉంది. వీటిలో ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్లు ఖరారు చేసుకుంటున్నాయి.
ఇప్పుడు ఇంకో ఆసక్తికర చిత్రం విడుదల ఖాయమైంది. ఆ చిత్రమే.. మేజర్. ఫిబ్రవరి 11నే రావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రం.. కరోనా మూడో వేవ్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. సరైన సమయంలో ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని హీరో, రైటర్ అడివి శేష్ ఇటీవల వెల్లడించాడు. ఇప్పుడతను డేట్ అనౌన్స్ చేసేశాడు.
మే 27న ‘మేజర్’ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ ప్రకటనను ఊరికే మాటలతో కాకుండా ఒక వీడియో రూపంలో ఇచ్చారు. 26/11 ముంబయి ఉగ్రవాద దాడుల సందర్భంగా టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ దాడుల సందర్భంగా ఉన్నికృష్ణ వీరత్వాన్ని చూపించే ఒక కళ్లు చెదిరే గ్లింప్స్ను ఈ సందర్భంగా చూపించారు.
అది చూస్తే ‘మేజర్’ ఒక క్లాసిక్గా నిలవబోతోందని.. భారతీయ ప్రేక్షకులందరినీ ఉద్వేగానికి గురి చేసి వారి మనసులు గెలవబోతోందని అనిపిస్తోంది. ఇంతకుముందు అడివి శేష్తో ‘గూఢచారి’ చిత్రాన్ని రూపొందించిన శశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతడితో కలిసి శేష్ స్క్రిప్టు తీర్చిదిద్దాడు. మహేష్ బాబు సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సోనీ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇందులో శేష్ సరసన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటించింది.
This post was last modified on February 22, 2022 6:07 pm
కేరళ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ విజయం దక్కించుకుంది. కేరళలోని రాజధాని నగరం తిరువనంతపురంలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ…
ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి, నటసింహం బాలయ్య గారాలపట్టి నారా బ్రాహ్మణి అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం గబ్బర్ సింగ్ ఎంత పెద్ద…
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
ఏపీ బీజేపీలో నాయకుల మధ్య లుకలుకలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఒకరిపై మరొకరు ఆధిపత్య రాజకీయాలు చేయడం వంటివి…
బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉండాలో.. ఏ పార్టీ…