ఈ సారి వేసవికి సినిమాల సందడి మామూలుగా ఉండబోవట్లేదు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న తరహాలో భారీ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్-2 లాంటి పాన్ ఇండియా సినిమాలకు తోడు సర్కారు వారి పాట, ఆచార్య.. ఇలా పెద్ద సినిమాలు చాలానే అభిమానులను అలరించబోతున్నాయి. వీటికి తోడు ఎఫ్-2, అంటే సుందరానికి, పక్కా కమర్షియల్, గని, లాంటి మీడియం రేంజ్ సినిమాల హంగామా కూడా ఉంది. వీటిలో ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్లు ఖరారు చేసుకుంటున్నాయి.
ఇప్పుడు ఇంకో ఆసక్తికర చిత్రం విడుదల ఖాయమైంది. ఆ చిత్రమే.. మేజర్. ఫిబ్రవరి 11నే రావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రం.. కరోనా మూడో వేవ్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. సరైన సమయంలో ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని హీరో, రైటర్ అడివి శేష్ ఇటీవల వెల్లడించాడు. ఇప్పుడతను డేట్ అనౌన్స్ చేసేశాడు.
మే 27న ‘మేజర్’ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ ప్రకటనను ఊరికే మాటలతో కాకుండా ఒక వీడియో రూపంలో ఇచ్చారు. 26/11 ముంబయి ఉగ్రవాద దాడుల సందర్భంగా టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ దాడుల సందర్భంగా ఉన్నికృష్ణ వీరత్వాన్ని చూపించే ఒక కళ్లు చెదిరే గ్లింప్స్ను ఈ సందర్భంగా చూపించారు.
అది చూస్తే ‘మేజర్’ ఒక క్లాసిక్గా నిలవబోతోందని.. భారతీయ ప్రేక్షకులందరినీ ఉద్వేగానికి గురి చేసి వారి మనసులు గెలవబోతోందని అనిపిస్తోంది. ఇంతకుముందు అడివి శేష్తో ‘గూఢచారి’ చిత్రాన్ని రూపొందించిన శశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతడితో కలిసి శేష్ స్క్రిప్టు తీర్చిదిద్దాడు. మహేష్ బాబు సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సోనీ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇందులో శేష్ సరసన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటించింది.
This post was last modified on February 22, 2022 6:07 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…