టీవీ సీరియళ్లతో మొదలుపెట్టి.. సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్తో మంచి పాపులారిటీనే సంపాదించిన నటుడు సమీర్. ఫుల్ లెంగ్త్ రోల్స్ తక్కువే అయినా.. చిన్న చిన్న పాత్రలతోనే గుర్తింపు సంపాదించాడతను. వందల సినిమాల్లో నటించి ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నాడు. ‘సై’లాంటి సినిమాల్లో అతను చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదురైన ఒడుదొడుకుల గురించి అతను మాట్లాడాడు.
ఈటీవీలో చేస్తున్న సీరియల్ నుంచి ఎఫైర్ పేరు చెప్పి తనను ఎలా తొలగించింది.. అలాగే నాగబాబుతో తనకున్న విభేదాల గురించి అతను ఆసక్తికర విషయాలు చెప్పాడు.తాను టీవీ సీరియళ్లలో చాలా బిజీగా ఉన్న రోజుల్లో తన గురించి ఈటీవీ సుమన్కు లేని పోనివి చెప్పి తన కెరీర్ను కొందరు దెబ్బ తీసినట్లు సమీర్ వెల్లడించాడు. తాను సెట్లోనే ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా ప్రచారం చేశారన్నాడు. సడెన్గా ఒక రోజు సుమన్ తనకు ఫోన్ చేసి ఈ సీరియల్ నుంచి తీసేస్తున్నట్లు చెప్పారన్నారు.
తనను సంజాయిషీ కూడా అడగలేదని.. సీరియల్ ఆపేశారని.. ఆ దెబ్బతో తనకు వేరే సీరియళ్లలో కూడా ఛాన్సులు ఆగిపోయాయని.. ఉన్నట్లుండి తాను రోడ్డు మీదికి వచ్చేశానని సమీర్ తెలిపాడు. ఎఫైర్ పెట్టుకోవాలంటే తనకు వేరే ప్లేసులే లేనట్లు సెట్లో పెట్టుకుంటానా అని సమీర్ ప్రశ్నించాడు. ఇంటి రెంట్, కారు ఈఎంఐ కట్టలేక ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని.. తర్వాత సినిమాల్లో నెమ్మదిగా అవకాశాలు పెరగడంతో కుదురుకున్నానని చెప్పాడు సమీర్.
కొంత కాలం తర్వాత సుమన్ తనకు ఫోన్ చేసి జరిగిన దానికి సారీ చెప్పినట్లు సమీర్ వెల్లడించాడు. ఇక నాగబాబుతో ‘ఆరెంజ్’ సినిమా చేసినపుడు.. ఆయన తనకు బాగా క్లోజ్ అయ్యారని.. అది చూసి ఓర్వలేక తన గురించి కొందరు ఆయనకు లేనిపోనివి చెప్పి తనను దూరం పెట్టేలా చేశారని.. కొంత కాలానికి ఆయనతోనూ విభేదాలు తొలగిపోయి ఇప్పుడు మామూలుగా ఉంటున్నట్లు సమీర్ తెలిపాడు.
This post was last modified on February 21, 2022 6:42 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…