టీవీ సీరియళ్లతో మొదలుపెట్టి.. సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్తో మంచి పాపులారిటీనే సంపాదించిన నటుడు సమీర్. ఫుల్ లెంగ్త్ రోల్స్ తక్కువే అయినా.. చిన్న చిన్న పాత్రలతోనే గుర్తింపు సంపాదించాడతను. వందల సినిమాల్లో నటించి ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నాడు. ‘సై’లాంటి సినిమాల్లో అతను చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదురైన ఒడుదొడుకుల గురించి అతను మాట్లాడాడు.
ఈటీవీలో చేస్తున్న సీరియల్ నుంచి ఎఫైర్ పేరు చెప్పి తనను ఎలా తొలగించింది.. అలాగే నాగబాబుతో తనకున్న విభేదాల గురించి అతను ఆసక్తికర విషయాలు చెప్పాడు.తాను టీవీ సీరియళ్లలో చాలా బిజీగా ఉన్న రోజుల్లో తన గురించి ఈటీవీ సుమన్కు లేని పోనివి చెప్పి తన కెరీర్ను కొందరు దెబ్బ తీసినట్లు సమీర్ వెల్లడించాడు. తాను సెట్లోనే ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా ప్రచారం చేశారన్నాడు. సడెన్గా ఒక రోజు సుమన్ తనకు ఫోన్ చేసి ఈ సీరియల్ నుంచి తీసేస్తున్నట్లు చెప్పారన్నారు.
తనను సంజాయిషీ కూడా అడగలేదని.. సీరియల్ ఆపేశారని.. ఆ దెబ్బతో తనకు వేరే సీరియళ్లలో కూడా ఛాన్సులు ఆగిపోయాయని.. ఉన్నట్లుండి తాను రోడ్డు మీదికి వచ్చేశానని సమీర్ తెలిపాడు. ఎఫైర్ పెట్టుకోవాలంటే తనకు వేరే ప్లేసులే లేనట్లు సెట్లో పెట్టుకుంటానా అని సమీర్ ప్రశ్నించాడు. ఇంటి రెంట్, కారు ఈఎంఐ కట్టలేక ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని.. తర్వాత సినిమాల్లో నెమ్మదిగా అవకాశాలు పెరగడంతో కుదురుకున్నానని చెప్పాడు సమీర్.
కొంత కాలం తర్వాత సుమన్ తనకు ఫోన్ చేసి జరిగిన దానికి సారీ చెప్పినట్లు సమీర్ వెల్లడించాడు. ఇక నాగబాబుతో ‘ఆరెంజ్’ సినిమా చేసినపుడు.. ఆయన తనకు బాగా క్లోజ్ అయ్యారని.. అది చూసి ఓర్వలేక తన గురించి కొందరు ఆయనకు లేనిపోనివి చెప్పి తనను దూరం పెట్టేలా చేశారని.. కొంత కాలానికి ఆయనతోనూ విభేదాలు తొలగిపోయి ఇప్పుడు మామూలుగా ఉంటున్నట్లు సమీర్ తెలిపాడు.
This post was last modified on February 21, 2022 6:42 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…