టీవీ సీరియళ్లతో మొదలుపెట్టి.. సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్తో మంచి పాపులారిటీనే సంపాదించిన నటుడు సమీర్. ఫుల్ లెంగ్త్ రోల్స్ తక్కువే అయినా.. చిన్న చిన్న పాత్రలతోనే గుర్తింపు సంపాదించాడతను. వందల సినిమాల్లో నటించి ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నాడు. ‘సై’లాంటి సినిమాల్లో అతను చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదురైన ఒడుదొడుకుల గురించి అతను మాట్లాడాడు.
ఈటీవీలో చేస్తున్న సీరియల్ నుంచి ఎఫైర్ పేరు చెప్పి తనను ఎలా తొలగించింది.. అలాగే నాగబాబుతో తనకున్న విభేదాల గురించి అతను ఆసక్తికర విషయాలు చెప్పాడు.తాను టీవీ సీరియళ్లలో చాలా బిజీగా ఉన్న రోజుల్లో తన గురించి ఈటీవీ సుమన్కు లేని పోనివి చెప్పి తన కెరీర్ను కొందరు దెబ్బ తీసినట్లు సమీర్ వెల్లడించాడు. తాను సెట్లోనే ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా ప్రచారం చేశారన్నాడు. సడెన్గా ఒక రోజు సుమన్ తనకు ఫోన్ చేసి ఈ సీరియల్ నుంచి తీసేస్తున్నట్లు చెప్పారన్నారు.
తనను సంజాయిషీ కూడా అడగలేదని.. సీరియల్ ఆపేశారని.. ఆ దెబ్బతో తనకు వేరే సీరియళ్లలో కూడా ఛాన్సులు ఆగిపోయాయని.. ఉన్నట్లుండి తాను రోడ్డు మీదికి వచ్చేశానని సమీర్ తెలిపాడు. ఎఫైర్ పెట్టుకోవాలంటే తనకు వేరే ప్లేసులే లేనట్లు సెట్లో పెట్టుకుంటానా అని సమీర్ ప్రశ్నించాడు. ఇంటి రెంట్, కారు ఈఎంఐ కట్టలేక ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని.. తర్వాత సినిమాల్లో నెమ్మదిగా అవకాశాలు పెరగడంతో కుదురుకున్నానని చెప్పాడు సమీర్.
కొంత కాలం తర్వాత సుమన్ తనకు ఫోన్ చేసి జరిగిన దానికి సారీ చెప్పినట్లు సమీర్ వెల్లడించాడు. ఇక నాగబాబుతో ‘ఆరెంజ్’ సినిమా చేసినపుడు.. ఆయన తనకు బాగా క్లోజ్ అయ్యారని.. అది చూసి ఓర్వలేక తన గురించి కొందరు ఆయనకు లేనిపోనివి చెప్పి తనను దూరం పెట్టేలా చేశారని.. కొంత కాలానికి ఆయనతోనూ విభేదాలు తొలగిపోయి ఇప్పుడు మామూలుగా ఉంటున్నట్లు సమీర్ తెలిపాడు.
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…