బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇప్పుడు రాజకీయాల్లో మారిన పరిణామాల నేపథ్యంలో వినిపిస్తున్న మాటలవి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని అన్యాయం చేస్తుందని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంచలన వ్యాఖ్యలతో మోడీని టార్గెట్ చేస్తున్నారు. మోడీని దేశం నుంచి తరిమివేయాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్హాట్గా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు ఎక్కువైంది.
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు కేసీఆర్ వెళ్లకపోవడంతో ఈ రెండు పార్టీల మధ్య రణం మరింత తీవ్రమైంది. రెండు పార్టీల నేతలు పరస్సరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేసే బీజేపీ నేతల వీపులు పగలగొట్టాలనేలా కేసీఆర్ తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జనగామ, ఆర్మూర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ల వీపులు పగలగొట్టారని సిరిసిల్లాలోనూ అదే చేయాలని రెచ్చగొట్టేలా కేసీఆర్ పేర్కొన్నారు.
ఆర్మూర్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై దాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు టీఆర్ఎస్ శ్రేణులే కారణమంటూ అరవింద్ ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై కూడా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కార్యకర్తలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగినా తాము చూసుకుంటామని కేటీఆర్ భరోసా ఇవ్వడంతో సిరిసిల్లాలో బీజేపీ నాయకులను దీటుగా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరం మరింత ముదరనుంది.
This post was last modified on February 19, 2022 3:23 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…