సినిమా ఇండస్ట్రీలో హిట్, ప్లాప్ మీదే కెరీర్ డిసైడ్ ఉంటుంది. ఎన్ని హిట్స్ ఇచ్చినా.. మధ్యలో ప్లాప్ వస్తే ఇంక అంతే సంగతులు. అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. దర్శకుడు రమేష్ వర్మ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే తయారైంది. చాలా కాలం తరువాత ‘రాక్షసుడు’ సినిమాతో హిట్టు కొట్టాడు ఈ దర్శకుడు. దీంతో అందరి దృష్టి అతడిపై పడింది. రవితేజని ఒప్పించి ‘ఖిలాడి’ సినిమాను పట్టాలెక్కించారు. విడుదలకు ముందు ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది.
కానీ రిలీజ్ తరువాత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు ఈ ‘ఖిలాడి’. ఒకట్రెండు సీక్వెన్స్ లు తప్ప సినిమా గురించి చెప్పుకునే స్థాయిలో ఏమీ లేదు. ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఆలోచించకుండానే రమేష్ వర్మతో వంద కోట్ల ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు ‘ఖిలాడి’ ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ. దానికి ‘యోధ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
ఇదో పాన్ ఇండియా సినిమా అని.. పెద్ద స్టార్ నటించబోతున్నట్లు మీడియా ముందు చెప్పారు.
ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. రమేష్ వర్మ డీలా పడ్డారు. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే.. ఇలాంటి సమయంలో రమేష్ వర్మ వంద కోట్ల ప్రాజెక్ట్ ని డీల్ చేయలేరనే మాటలు వినిపిస్తున్నాయి. నిర్మాత కూడా ఇదే ఫీలైతే మాత్రం ఆ ప్రాజెక్ట్ రమేష్ వర్మ చేజారిపోయినట్లే.
అయితే ఆయనకు మరో సినిమా అవకాశం ఉంది. ‘ఖిలాడి’ సినిమా కంటే ముందే ‘రాక్షసుడు 2’ ప్రాజెక్ట్ సెట్ అయింది. దానికి కూడా కోనేరు సత్యనారాయణే నిర్మాత. ఆ సినిమాని గనుక తక్కువ బడ్జెట్ లో తీసి హిట్ కొడితే మాత్రం రమేష్ వర్మ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on February 17, 2022 10:20 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…