Movie News

వంద కోట్ల ప్రాజెక్ట్.. మిస్ అయినట్లే!

సినిమా ఇండస్ట్రీలో హిట్, ప్లాప్ మీదే కెరీర్ డిసైడ్ ఉంటుంది. ఎన్ని హిట్స్ ఇచ్చినా.. మధ్యలో ప్లాప్ వస్తే ఇంక అంతే సంగతులు. అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. దర్శకుడు రమేష్ వర్మ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే తయారైంది. చాలా కాలం తరువాత ‘రాక్షసుడు’ సినిమాతో హిట్టు కొట్టాడు ఈ దర్శకుడు. దీంతో అందరి దృష్టి అతడిపై పడింది. రవితేజని ఒప్పించి ‘ఖిలాడి’ సినిమాను పట్టాలెక్కించారు. విడుదలకు ముందు ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో వచ్చింది.  

కానీ రిలీజ్ తరువాత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు ఈ ‘ఖిలాడి’. ఒకట్రెండు సీక్వెన్స్ లు తప్ప సినిమా గురించి చెప్పుకునే స్థాయిలో ఏమీ లేదు. ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఆలోచించకుండానే రమేష్ వర్మతో వంద కోట్ల ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు ‘ఖిలాడి’ ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ. దానికి ‘యోధ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

ఇదో పాన్ ఇండియా సినిమా అని.. పెద్ద స్టార్ నటించబోతున్నట్లు మీడియా ముందు చెప్పారు.  
ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. రమేష్ వర్మ డీలా పడ్డారు. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే.. ఇలాంటి సమయంలో రమేష్ వర్మ వంద కోట్ల ప్రాజెక్ట్ ని డీల్ చేయలేరనే మాటలు వినిపిస్తున్నాయి. నిర్మాత కూడా ఇదే ఫీలైతే మాత్రం ఆ ప్రాజెక్ట్ రమేష్ వర్మ చేజారిపోయినట్లే.

అయితే ఆయనకు మరో సినిమా అవకాశం ఉంది. ‘ఖిలాడి’ సినిమా కంటే ముందే ‘రాక్షసుడు 2’ ప్రాజెక్ట్ సెట్ అయింది. దానికి కూడా కోనేరు సత్యనారాయణే నిర్మాత. ఆ సినిమాని గనుక తక్కువ బడ్జెట్ లో తీసి హిట్ కొడితే మాత్రం రమేష్ వర్మ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి!

This post was last modified on February 17, 2022 10:20 am

Share

Recent Posts

కొత్త మెట్లు ఎక్కేసిన కిరణ్ అబ్బవరం

కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…

25 minutes ago

కారులోనే ప్రయాణమంటున్న మల్లారెడ్డి

పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…

48 minutes ago

100 కోట్లు రాలేదంటే ఏమనుకోవాలి

నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…

1 hour ago

`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్ర‌జ‌లు మేకిన్…

2 hours ago

మ‌న్యానికి కుంకీల‌ను పంపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని రైతులు గ‌త కొన్ని రోజులుగా ఏనుగుల బెడ‌ద‌ను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొర‌బ‌డి ప్ర‌జ‌ల‌ను…

3 hours ago

స్థానికంపై జగన్ సీరియస్ గానే ఉన్నారా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…

4 hours ago