తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలో దిగుతోందంటే.. దానికి పోటీగా ఇంకో సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా పవన్ చిత్రంతో పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర నిలవడం కష్టమే. అందులోనూ ప్రి రిలీజ్ హైప్ ఎక్కువగా ఉన్న పవన్ సినిమాకు ఎదురెళ్తే చాలా ఇబ్బందే.
సంక్రాంతి టైంలో మాత్రమే ఇలాంటి పోటీకి ఆస్కారముంటుంది. వేరే సమయాల్లో ఎప్పుడూ పవన్ సినిమాకు పోటీ ఉండదు. ఐతే వచ్చే వారం పవన్ సినిమా భీమ్లా నాయక్ రాబోతోందని తెలిసి కూడా శర్వానంద్ చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు వెనక్కి తగ్గట్లేదు.
భీమ్లా నాయక్ వాయిదా పడుతుందన్న అంచనాలతో ఈ సినిమాను ఫిబ్రవరి 25కు షెడ్యూల్ చేశారు. కానీ పవన్ సినిమాను ఆ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఆడవాళ్ళు మీకు జోహార్లుతో పాటు వరుణ్ తేజ్ సినిమా గనిని కూడా వాయిదా వేయడం లాంఛనమే అని అంతా అనుకున్నారు.
కానీ గని టైం సైలెంటుగా ఉండగా.. ఆడవాళ్ళు మీకు జోహార్లు బృందం మాత్రం తమ సినిమా ఫిబ్రవరి 25కే వస్తుందని ఘంటాపథంగా చెబుతోంది. బుధవారం హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన్నా డబ్బింగ్ పూర్తి చేసి ఫొటోలకు పోజులు ఇచ్చారు.
ఈ ఫొటోను రిలీజ్ చేస్తూ తమ సినిమా 25కే వస్తుందంటూ చిత్ర బృందం మీడియాకు సమాచారం ఇచ్చింది. మరి భీమ్లా నాయక్ బరిలో ఉన్నా తమకు ఇబ్బంది లేదని ధీమాగా ఈ అప్డేట్ ఇచ్చారా.. లేక పవన్ సినిమా ఏమైనా వాయిదా పడుతుందేమో అన్న ఆశతోనా అన్నది తెలియడం లేదు.
వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతున్న శర్వాకు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం. అతడి కెరీర్కు చాలా కీలకమైన సినిమా విషయంలో ఇంత రిస్క్ అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి శర్వా అండ్ టీం ధీమా ఏంటో చూడాలి. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల రూపొందించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
This post was last modified on February 17, 2022 6:19 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…