తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలో దిగుతోందంటే.. దానికి పోటీగా ఇంకో సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా పవన్ చిత్రంతో పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర నిలవడం కష్టమే. అందులోనూ ప్రి రిలీజ్ హైప్ ఎక్కువగా ఉన్న పవన్ సినిమాకు ఎదురెళ్తే చాలా ఇబ్బందే.
సంక్రాంతి టైంలో మాత్రమే ఇలాంటి పోటీకి ఆస్కారముంటుంది. వేరే సమయాల్లో ఎప్పుడూ పవన్ సినిమాకు పోటీ ఉండదు. ఐతే వచ్చే వారం పవన్ సినిమా భీమ్లా నాయక్ రాబోతోందని తెలిసి కూడా శర్వానంద్ చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు వెనక్కి తగ్గట్లేదు.
భీమ్లా నాయక్ వాయిదా పడుతుందన్న అంచనాలతో ఈ సినిమాను ఫిబ్రవరి 25కు షెడ్యూల్ చేశారు. కానీ పవన్ సినిమాను ఆ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఆడవాళ్ళు మీకు జోహార్లుతో పాటు వరుణ్ తేజ్ సినిమా గనిని కూడా వాయిదా వేయడం లాంఛనమే అని అంతా అనుకున్నారు.
కానీ గని టైం సైలెంటుగా ఉండగా.. ఆడవాళ్ళు మీకు జోహార్లు బృందం మాత్రం తమ సినిమా ఫిబ్రవరి 25కే వస్తుందని ఘంటాపథంగా చెబుతోంది. బుధవారం హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన్నా డబ్బింగ్ పూర్తి చేసి ఫొటోలకు పోజులు ఇచ్చారు.
ఈ ఫొటోను రిలీజ్ చేస్తూ తమ సినిమా 25కే వస్తుందంటూ చిత్ర బృందం మీడియాకు సమాచారం ఇచ్చింది. మరి భీమ్లా నాయక్ బరిలో ఉన్నా తమకు ఇబ్బంది లేదని ధీమాగా ఈ అప్డేట్ ఇచ్చారా.. లేక పవన్ సినిమా ఏమైనా వాయిదా పడుతుందేమో అన్న ఆశతోనా అన్నది తెలియడం లేదు.
వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతున్న శర్వాకు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం. అతడి కెరీర్కు చాలా కీలకమైన సినిమా విషయంలో ఇంత రిస్క్ అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి శర్వా అండ్ టీం ధీమా ఏంటో చూడాలి. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల రూపొందించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
This post was last modified on February 17, 2022 6:19 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…