తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలో దిగుతోందంటే.. దానికి పోటీగా ఇంకో సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా పవన్ చిత్రంతో పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర నిలవడం కష్టమే. అందులోనూ ప్రి రిలీజ్ హైప్ ఎక్కువగా ఉన్న పవన్ సినిమాకు ఎదురెళ్తే చాలా ఇబ్బందే.
సంక్రాంతి టైంలో మాత్రమే ఇలాంటి పోటీకి ఆస్కారముంటుంది. వేరే సమయాల్లో ఎప్పుడూ పవన్ సినిమాకు పోటీ ఉండదు. ఐతే వచ్చే వారం పవన్ సినిమా భీమ్లా నాయక్ రాబోతోందని తెలిసి కూడా శర్వానంద్ చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు వెనక్కి తగ్గట్లేదు.
భీమ్లా నాయక్ వాయిదా పడుతుందన్న అంచనాలతో ఈ సినిమాను ఫిబ్రవరి 25కు షెడ్యూల్ చేశారు. కానీ పవన్ సినిమాను ఆ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఆడవాళ్ళు మీకు జోహార్లుతో పాటు వరుణ్ తేజ్ సినిమా గనిని కూడా వాయిదా వేయడం లాంఛనమే అని అంతా అనుకున్నారు.
కానీ గని టైం సైలెంటుగా ఉండగా.. ఆడవాళ్ళు మీకు జోహార్లు బృందం మాత్రం తమ సినిమా ఫిబ్రవరి 25కే వస్తుందని ఘంటాపథంగా చెబుతోంది. బుధవారం హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన్నా డబ్బింగ్ పూర్తి చేసి ఫొటోలకు పోజులు ఇచ్చారు.
ఈ ఫొటోను రిలీజ్ చేస్తూ తమ సినిమా 25కే వస్తుందంటూ చిత్ర బృందం మీడియాకు సమాచారం ఇచ్చింది. మరి భీమ్లా నాయక్ బరిలో ఉన్నా తమకు ఇబ్బంది లేదని ధీమాగా ఈ అప్డేట్ ఇచ్చారా.. లేక పవన్ సినిమా ఏమైనా వాయిదా పడుతుందేమో అన్న ఆశతోనా అన్నది తెలియడం లేదు.
వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతున్న శర్వాకు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం. అతడి కెరీర్కు చాలా కీలకమైన సినిమా విషయంలో ఇంత రిస్క్ అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి శర్వా అండ్ టీం ధీమా ఏంటో చూడాలి. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల రూపొందించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
This post was last modified on February 17, 2022 6:19 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…