మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట నుంచి రిలీజైన తొలి సింగిల్ కళావతికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది శ్రోతల నుంచి. ఈ సినిమా ప్రోమో రిలీజైనపుడే ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అర్థమైపోయింది. ఇక పాట అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉండటం.. లిరికల్ వీడియోను చాలా రిచ్గా తీర్చిదిద్దడంతో చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఎంతో శ్రావ్యంగా ఆలపించాడు.
కాకపోతే తెలుగు పదాలను ఖూనీ చేశాడన్న విమర్శ మాత్రం ఉంది. ఆ ఒక్క కంప్లైంట్ పక్కన పెడితే పాట మాత్రం సూపర్ హిట్ అనడంలో సందేహం లేదు. ఈ పాట యూట్యూబ్లో రికార్డుల మోత మోగిస్తున్నట్లే కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో 1.6 కోట్ల వ్యూస్, 8 లక్షల లైక్స్ వచ్చాయి ఈ పాటకు. ఇది ఆల్ ఇండియా రికార్డ్ కావడం విశేషం. మహేష్ బాబు-కీర్తి సురేష్-తమన్-సిద్ శ్రీరామ్-మైత్రీ మూవీ మేకర్స్-పరశురామ్.. ఈ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ రికార్డు గురించి మరీ ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.
కాకపోతే ఈ రికార్డు కోసం మైత్రీ వాళ్లకు డబ్బులు ఖర్చయ్యాయంటూ ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం. పెయిడ్ ప్రమోషన్లతో దీనికి వ్యూస్, లైక్స్ పెంచినట్లుగా కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. వ్యూస్, లైక్స్ బ్రేకప్స్తో ఇందుకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు.
మధ్య మధ్యలో వ్యూస్, లైక్స్ అనూహ్యంగా పెరిగాయని.. ఆరంభంలో కంటే తర్వాత లైక్స్, వ్యూస్ ఎక్కువ కావడం వెనుక కారణాలు వేరే ఉన్నాయని.. పనిగట్టుకుని వీటిని పెంచడానికి డబ్బులు ఖర్చు చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐతే బేసిగ్గానే పెద్ద హిట్టయ్యే స్కోప్ ఉన్న ఈ పాటకు ఇలా పనిగట్టుకుని వ్యూస్, లైక్స్ పెంచడానికి ప్రయత్నించారంటే ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఇలా చేసింది నిజమే అయితే.. అదంతా అవసరమా అన్నది ప్రశ్న.
This post was last modified on February 15, 2022 9:55 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…