Movie News

అఖిల్ ప్యాన్ ఇండియా ప్లాన్స్

ప్యాన్ ఇండియా.. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అందరి బుర్రలో ఇదే తిరుగుతోంది. ప్రభాస్‌తో మొదలైన ఈ ప్యాన్ ఇండియా మేనియా అల్లు అర్జున్ ‘పుష్ప’తో పీక్స్‌కి వెళ్లిపోయింది. దాంతో  అందరూ తమ సినిమాని ఆ స్థాయిలోనే తీయాలనే ఆరాటంలో ఉన్నారు. ఇప్పుడు అఖిల్ సినిమా విషయంలోనూ అలాంటి ప్రణాళికలే నడుస్తున్నాయి.     

సురేందర్‌‌ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కండలు పెంచి కంప్లీట్‌గా మేకోవర్ కూడా అయ్యాడు అఖిల్. అతని కష్టం చూస్తుంటేనే ఈ చిత్రాన్ని ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా మలుస్తున్నారనే విషయం అర్థమవుతోంది. అయితే టేకింగ్‌ విషయంలోనే కాదు.. రిలీజ్ విషయంలోనూ సురేందర్‌‌ రెడ్డి, నిర్మాత అనిల్ సుంకర భారీ ప్లాన్‌తో ఉన్నారట.       

ఏజెంట్ సినిమాని తెలుగులోనే తీసినా.. పలు భారతీయ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కచ్చితంగా ప్యాన్ ఇండియా లెవెల్‌లోనే ఈ సినిమా ఉంటుందని రీసెంట్‌గా సురేందర్‌‌ రెడ్డి భార్య దీప తన ఇన్‌స్టా చాట్‌లో రివీల్ చేశారు. నెటిజన్స్‌తో చాట్ చేస్తున్నప్పుడు ఆమెని కొందరు ఈ సినిమా గురించి గుచ్చి గుచ్చి అడిగారు. ఆప్పుడే ఆమె ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు.        

అంతే కాదు.. ఏజెంట్ మూవీ అంచనాల్ని మించి ఉంటుందని.. అఖిల్ చాలా డెడికేటెడ్ యాక్టర్ అని, హార్డ్ వర్క్ చేస్తాడని చెప్పారు. ఈ నెల 15 తర్వాత షూట్ రీస్టార్ట్ కాబోతోందని కూడా కన్‌ఫర్మ్ చేశారామె. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ కొంత పార్ట్‌ని బుడాపెస్ట్‌లో తీశారు. తర్వాత కరోనా కారణంగా బ్రేక్ పడింది. మలయాళ స్టార్‌‌ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటించడం, తమన్ సంగీతం అందించడంతో అంచనాలు పెరిగాయి. ఇప్పుడీ ప్యాన్ ఇండియా సంగతులతో అవి మరింత పెరిగిపోతాయి.

This post was last modified on February 10, 2022 10:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

1 hour ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

1 hour ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

1 hour ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago