శత్రువు, దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లతో ఒకప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు ఎమ్మెస్ రాజు. ఆయన పేరులోని ఎం, ఎస్ అక్షరాలకు మెగా సక్సెస్ అన్న అబ్రివేషన్ కూడా ఇచ్చేవారు అప్పట్లో. ఐతే తనకున్న పేరును ఆ తర్వాతి కాలంలో ఆయన నిలబెట్టుకోలేకపోయాడు.
వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయాడు. ఐతే చాలా గ్యాప్ తర్వాత 2020లో ఆయన్నుంచి డర్టీ హరి అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కాదు.. దర్శకుడు కావడం విశేషం. అంతకుముందు తీసిన వాన, తూనీగ తూనీగ చిత్రాలకు ఆయనకు నిరాశను మిగల్చగా.. డర్టీ హరి మాత్రం మంచి ఫలితాన్నే అందించింది. అందులో బోల్డ్ సీన్లు చూసి అంతా అవాక్కయ్యారు. ఓటీటీలో రిలీజై యువ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది డర్టీ హరి.
ఈ సినిమాతో సక్సెస్ ఫార్ములాను మళ్లీ పట్టేసినట్లు కనిపించిన రాజు.. ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ అనే సినిమాతో రాబోతున్నాడు. సంక్రాంతికే అనుకున్న ఈ చిత్రం వాయిదా పడింది. ఈ నెలలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు. టైటిల్కు తగ్గట్లే ఇది పక్కా రొమాంటిక్ మూవీ అనేది ట్రైలర్లో స్పష్టంగా తెలిసిపోయింది.
ఆరంభం నుంచి చివరిదాకా చర్చంతా రొమాన్స్ గురించే. గోవా ట్రిప్కు వెళ్లి అక్కడ అమ్మాయిలతో సయ్యాటలు ఆడే ఇద్దరబ్బాయిల కథ ఇది. అమ్మాయిల అందాలు.. ఇంటిమేట్ సీన్లు.. కొన్ని బోల్డ్ డైలాగ్స్.. ట్రైలరంతా ఇదే వరస. డర్టీ హరిలో మాదిరి క్రైమ్ ఎలిమెంట్ కూడా ఏమీ కనిపించడం లేదిందులో. కథ పరంగా ఆసక్తి రేకెత్తించే అంశాలేమీ ట్రైలర్లో లేవు. కేవలం రొమాన్స్ కోసమైతే ఈ సినిమా చూడొచ్చు. అంతకుమించి రాజు గారు ఆఫర్ చేస్తున్నదేమీ లేదు.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…