గత రెండు దశాబ్దాల్లో తెలుగు సినిమాల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ ఒకడు. మణిశర్మ హవా తగ్గాక ఒక పదేళ్లు అతనే తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో దాదాపుగా అందరు టాప్ స్టార్లతోనూ అతను సినిమాలు చేశాడు. తమిళంలోనూ పెద్ద హీరోలు చాలామందితో పని చేశాడు. ఐతే గత మూణ్నాలుగేళ్లలో అతడి జోరు కొంచెం తగ్గింది.
తమన్ ఆధిపత్యం సాగుతోంది. ఇంతకుముందు దేవికి తమన్ పోటీనివ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు తమన్ పోటీని తట్టుకోవడమే దేవికి కష్టంగా ఉంది. ఈ మధ్య పుష్పతో దేవి పేరు మళ్లీ మార్మోగింది కానీ.. అంతకుముందు మాత్రం చాలా సినిమాల్లో అతను అంచనాలను అందుకోలేకపోయాడు. దేవి అంత శ్రద్ధ, సమయం పెట్టి పని చేయట్లేదమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవి అందించిన కొన్ని ఆడియోలను వింటే అదే అభిప్రాయం కలుగుతోంది.
తాజాగా ఖిలాడి సినిమా విషయంలో దేవి అంచనాలను అందుకోలేకపోయాడు. ఇందులోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. పాటల టేకింగ్ ఓకే కానీ.. వినడానికి మాత్రం మామూలుగా అనిపించాయి. ఐతే ఇందుక్కారణమేంటో చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు రమేష్ వర్మ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవి కేవలం అరగంటలో ఈ సినిమా పాటల ట్యూన్స్ అన్నీ ఇచ్చేసినట్లు వెల్లడించాడు.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా రమేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చెప్పడానికి తాను దేవి దగ్గరికి వెళ్తే.. అర్ధరాత్రి పన్నెండు వరకు తనకు కథ చెప్పే అవకాశం ఇవ్వలేదని.. ఆ తర్వాత కథ చెప్పమన్నాడని.. కథ పూర్తయ్యేసరికి మూడు మూడున్నర అయిందని.. అప్పటికప్పుడు మొదలుపెట్టి అరగంటలో ఆరు ట్యూన్లు ఇచ్చాడని.. అందులో ఐదు పాటలు సినిమాలో వాడామని అన్నాడు రమేష్. దేవి పాటల గురించి రమేష్ నెగెటివ్ కామెంట్స్ ఏమీ చేయలేదు కానీ.. ఈ వీడియోను నెటిజన్లు వైలర్ చేస్తూ దేవిని ట్రోల్ చేస్తున్నారు. అరగంటలో ఆరు పాటలా.. అందుకే ఆల్బం ఇంత యావరేజ్గా ఉందని, తమన్తో దేవి పోటీ పడలేకపోతుండటానికి ఇదే కారణమని కౌంటర్లు వేస్తున్నారు.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…