Movie News

పూజాహెగ్డే సినిమా ఆగిపోలేదట!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గానే ‘బీస్ట్’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. హిందీలో రణవీర్ సింగ్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. 

తెలుగులో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పూజా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతుందని సమాచారం. నిజానికి రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో ఓ సినిమాను ప్రకటించారు. దానికి ‘కబీ ఈద్ కబీ దివాలి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఫైనల్ చేశారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై కూడా పూజా సైన్ చేసింది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిర్మాత సాజిద్ నడియాద్వాలా సినిమా టైటిల్ ను ‘భాయ్ జాన్’గా మార్చారట. మార్చి 15 నుంచి ముంబైలో షూటింగ్ మొదలుకానుంది. 

ఇందులో సల్మాన్ కి జోడీగా పూజా కనిపించనుంది. ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారట. ఆయన సరసన సౌత్ హీరోయిన్ కనిపించనుందని సమాచారం. పూజా, వెంకీ లాంటి స్టార్లు నటిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా బజ్ క్రియేట్ అయింది. 

This post was last modified on February 8, 2022 8:41 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

5 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

5 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago