టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గానే ‘బీస్ట్’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. హిందీలో రణవీర్ సింగ్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది.
తెలుగులో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పూజా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతుందని సమాచారం. నిజానికి రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో ఓ సినిమాను ప్రకటించారు. దానికి ‘కబీ ఈద్ కబీ దివాలి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఫైనల్ చేశారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై కూడా పూజా సైన్ చేసింది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిర్మాత సాజిద్ నడియాద్వాలా సినిమా టైటిల్ ను ‘భాయ్ జాన్’గా మార్చారట. మార్చి 15 నుంచి ముంబైలో షూటింగ్ మొదలుకానుంది.
ఇందులో సల్మాన్ కి జోడీగా పూజా కనిపించనుంది. ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారట. ఆయన సరసన సౌత్ హీరోయిన్ కనిపించనుందని సమాచారం. పూజా, వెంకీ లాంటి స్టార్లు నటిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా బజ్ క్రియేట్ అయింది.
This post was last modified on February 8, 2022 8:41 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…