టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గానే ‘బీస్ట్’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. హిందీలో రణవీర్ సింగ్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది.
తెలుగులో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పూజా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతుందని సమాచారం. నిజానికి రెండేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో ఓ సినిమాను ప్రకటించారు. దానికి ‘కబీ ఈద్ కబీ దివాలి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఫైనల్ చేశారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ పై కూడా పూజా సైన్ చేసింది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిర్మాత సాజిద్ నడియాద్వాలా సినిమా టైటిల్ ను ‘భాయ్ జాన్’గా మార్చారట. మార్చి 15 నుంచి ముంబైలో షూటింగ్ మొదలుకానుంది.
ఇందులో సల్మాన్ కి జోడీగా పూజా కనిపించనుంది. ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారట. ఆయన సరసన సౌత్ హీరోయిన్ కనిపించనుందని సమాచారం. పూజా, వెంకీ లాంటి స్టార్లు నటిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా బజ్ క్రియేట్ అయింది.
This post was last modified on February 8, 2022 8:41 pm
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…