జె.కె.భారవి.. ‘అన్నమయ్య’ లాంటి ఆల్ టైం క్లాసిక్కు కథ, మాటలు అందించి గొప్ప పేరు సంపాదించిన రచయిత. ఆ తర్వాత ఆయన రచనలో వచ్చిన ‘శ్రీరామదాసు’ సైతం ఘనవిజయాన్నందుకుంది. ఆయనకు తెలుగు సినిమా చరిత్రలో ఈ రెండు చిత్రాలు ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చిపెట్టాయి. ఇవి కాక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ మంజునాథ, పాండు రంగడు, షిరిడి సాయి, శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం లాంటి ఆధ్యాత్మిక చిత్రాలకు సైతం భారవి రచన చేశారు.
ఇవి కాక ‘శక్తి’ సహా కొన్ని కమర్షియల్ సినిమాలకు కూడా ఆయన స్క్రిప్టు విభాగంలో పని చేశారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసిన భారవి.. చివరగా స్వీయ దర్శకత్వంలో ‘జగద్గురు ఆది శంకరాచార్య’ అనే సినిమా తీశారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కూడా. ప్రముఖ తారాగణాన్ని పెట్టుకుని పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తీశారు భారవి. ఐతే ఈ సినిమా ఆయకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
తాజాగా ఒక మీడియా సంస్థకు భారవి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఆదిశంకరాచార్య’ తర్వాత కనుమరుగైపోవడానికి కారణాలేంటో ఆయన వివరించారు. అంతకుముందు చేసిన సినిమాలతో తాను బాగానే సంపాదించానని.. కానీ ఈ ఒక్క సినిమా తనను దాదాపుగా రోడ్డు మీదికి తీసుకొచ్చేసిందని అన్నారు భారవి. ఈ సినిమా మీద పెట్టిన డబ్బులన్నీ పోయాయని.. ఎన్నో కార్లు చూసిన తాను ఇప్పుడు ఇంటర్వ్యూలో బైక్ వేసుకుని రావాల్సి వచ్చిందని భారవి వివరించారు.
తన రచనలో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి గొప్ప సినిమాల్లో నటించిన నాగార్జునకు తన పరిస్థితి తెలిస్తే కచ్చితంగా ఆర్థిక సాయం చేస్తారని.. కానీ ఎవరినీ సాయం అడగడం తనకు ఇష్టముండదని., అందుకే సైలెంటుగా ఉన్నానని చెప్పారు భారవి. ప్రస్తుతం తాను కొన్ని సినిమాలకు పని చేస్తున్నానని.. ఐతే గత సినిమాల ప్రభావం, కరోనా కారణంగాసరిగా పారితోషకాలు అందట్లేదని.. అందుకే ఇబ్బంది పడుతున్నానని చెప్పారాయన.
This post was last modified on February 8, 2022 4:12 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…