గత కొన్నేళ్లలో బాలీవుడ్లో మిగతా స్టార్లను వెనక్కి నెట్టి ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు ఖాన్ త్రయం ముందు ఎవరూ నిలవగలిగేవారు కాదు కానీ.. అక్షయ్ వరుస హిట్లు కొట్టడం.. అలాగే వేగంగా సినిమాలు చేయడం ద్వారా వాళ్లను దాటి ముందుకెళ్లిపోయాడు.
వార్షికాదాయం, సక్సెస్ రేట్ లెక్కల్లో చూస్తే బాలీవుడ్లో అక్షయే నంబర్ వన్ హీరో. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో, ప్రధాని నరేంద్ర మోడీతో అక్షయ్కి ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా తెలిసిందే. బాలీవుడ్లో చాలా కొద్దిమంది భాజపా అనుకూల హీరోల్లో అక్షయ్ ఒకడు. అలాంటి అక్షయ్ ఆ మధ్య కపిల్ శర్మ నిర్వహించే కామెడీ షోకు వెళ్లి సరదాగా మాట్లాడుతూ.. అనుకోకుండా బీజేపీ మీద ఒక జోక్ పేల్చాడు.
ఐతే షూట్ టైంలో తర్వాత విషయం గుర్తించి ఆ జోక్ను ఎపిసోడ్ నుంచి తీసేయాలని కపిల్ అండ్ కోను అడిగాడట.కానీ అక్షయ్కి ఓకే చెప్పి.. షోలో మాత్రం ఆ జోక్ను అలాగే ఉంచేశారు. అది ప్రసారం అయిపోయింది. భాజపా మద్దతుదారుగా ఉన్న అక్షయ్.. అదే పార్టీ మీద జోక్ పేల్చడంతో ఇరుకున పడ్డాడు. ఇది అతణ్ని బాగా హర్ట్ చేసింది. షో నిర్వాహకులపై సీరియస్ అయిన అక్షయ్.. కపిల్ షోను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కొన్నేళ్లుగా తన ప్రతి సినిమా ప్రమోషన్కూ కపిల్ షోకు వెళ్తున్నాడు అక్షయ్. దాదాపుగా బాలీవుడ్లో ప్రతి పెద్ద సినిమానూ ఈ షోలో ప్రమోట్ చేస్తారు. ఐతే ఇకపై అక్షయ్ ఆ షోకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడట. వచ్చే నెలలో విడుదల కావాల్సిన తన కొత్త చిత్రం బచ్చన్ పాండేన రిలీజ్ టైంలో ఈ షోకు రావాలని అడిగినప్పటికీ.. నో చెప్పేశాడట. తన మాట మన్నించనందుకు అతను బాగానే హర్టయినట్లు తెలుస్తోంది. ‘బచ్చన్ పాండే’ తెలుగులో ‘కాటమరాయుడు’గా రీమేక్ అయిన తమిళ చిత్రం ‘వీరం’కు రీమేక్ కావడం విశేషం.
This post was last modified on February 8, 2022 2:20 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…