రెండు మూడు వారాల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. సంక్రాంతి సినిమాలు కాస్త సందడి చేశాక.. కనీస స్థాయిలో ప్రభావం చూపిన సినిమాలేవీ లేవు. రిలీజ్లే తగ్గిపోగా.. విడుదలైన సినిమాలు కూడా ఏమాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. జనవరి చివరి వారంలో వచ్చిన గుడ్ లక్ సఖి తొలి రోజు సాయంత్రానికే చేతులెత్తేసింది.
వీకెండ్ను కూడా ఉపయోగించుకోలేకపోయింది. గత వారాంతానికి షెడ్యూల్ అయిన డీజే టిల్లు ఎందుకో వారం వెనక్కి వెళ్లిపోయింది. తెలుగులో ఇంకే పేరున్న సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇదే మంచి తరుణం అనుకుని విశాల్ తన కొత్త చిత్రం సామాన్యుడును థియేటర్లలోకి దించాడు. తమిళంలో కూడా పెద్దగా పోటీ లేకుండా విడుదలైందీ చిత్రం. తెలుగులో విశాల్ సినిమాల్లో ఏదీ ఇప్పటిదాకా విడుదల కాని స్థాయిలో దీనికి రిలీజ్ ఛాన్స్ దక్కింది.
కోరుకున్న దాని కంటే ఎక్కువే థియేటర్లు ఇచ్చారు.
కానీ ఏం లాభం.. సామాన్యుడు ఈ అవకాశాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. ఈ సినిమాకు మామూలుగానే బజ్ లేదు. తొలి రోజు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇక సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఫస్ట్ డేనే బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరిస్థితి ఎదుర్కొంది.
థియేటర్ల మెయింటైనెన్స్కు సరిపడా డబ్బులు కూడా రాని పరిస్థితి. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి 50 లక్షలు కూడా షేర్ రాలేదు. ఇక తర్వాతి రోజుల పరిస్థితి కొత్తగా చెప్పేదేముంది. శని, ఆదివారాల్లో కూడా వసూళ్లు పుంజుకోలేదు. సినిమాను నడిపిస్తే ఆదాయం రాకపోగా.. మెయింటెనెన్స్ భారంగా మారడంతో చాలా చోట్ల షోలు ఆపేసే పరిస్థితి. అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంటాడనుకుంటే.. విశాల్ సినిమాకు ఇలాంటి దయనీయమైన పరిస్థితి తలెత్తింది.
This post was last modified on February 8, 2022 8:13 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…