రెండు మూడు వారాల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. సంక్రాంతి సినిమాలు కాస్త సందడి చేశాక.. కనీస స్థాయిలో ప్రభావం చూపిన సినిమాలేవీ లేవు. రిలీజ్లే తగ్గిపోగా.. విడుదలైన సినిమాలు కూడా ఏమాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. జనవరి చివరి వారంలో వచ్చిన గుడ్ లక్ సఖి తొలి రోజు సాయంత్రానికే చేతులెత్తేసింది.
వీకెండ్ను కూడా ఉపయోగించుకోలేకపోయింది. గత వారాంతానికి షెడ్యూల్ అయిన డీజే టిల్లు ఎందుకో వారం వెనక్కి వెళ్లిపోయింది. తెలుగులో ఇంకే పేరున్న సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇదే మంచి తరుణం అనుకుని విశాల్ తన కొత్త చిత్రం సామాన్యుడును థియేటర్లలోకి దించాడు. తమిళంలో కూడా పెద్దగా పోటీ లేకుండా విడుదలైందీ చిత్రం. తెలుగులో విశాల్ సినిమాల్లో ఏదీ ఇప్పటిదాకా విడుదల కాని స్థాయిలో దీనికి రిలీజ్ ఛాన్స్ దక్కింది.
కోరుకున్న దాని కంటే ఎక్కువే థియేటర్లు ఇచ్చారు.
కానీ ఏం లాభం.. సామాన్యుడు ఈ అవకాశాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. ఈ సినిమాకు మామూలుగానే బజ్ లేదు. తొలి రోజు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇక సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఫస్ట్ డేనే బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరిస్థితి ఎదుర్కొంది.
థియేటర్ల మెయింటైనెన్స్కు సరిపడా డబ్బులు కూడా రాని పరిస్థితి. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి 50 లక్షలు కూడా షేర్ రాలేదు. ఇక తర్వాతి రోజుల పరిస్థితి కొత్తగా చెప్పేదేముంది. శని, ఆదివారాల్లో కూడా వసూళ్లు పుంజుకోలేదు. సినిమాను నడిపిస్తే ఆదాయం రాకపోగా.. మెయింటెనెన్స్ భారంగా మారడంతో చాలా చోట్ల షోలు ఆపేసే పరిస్థితి. అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంటాడనుకుంటే.. విశాల్ సినిమాకు ఇలాంటి దయనీయమైన పరిస్థితి తలెత్తింది.
This post was last modified on February 8, 2022 8:13 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…