Movie News

‘లైగర్’ డిజిటల్ రైట్స్.. ఫ్యాన్సీ రేటు!

‘లైగర్’ డిజిటల్ రైట్స్.. ఫ్యాన్సీ రేటు!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. దానికి తగ్గట్లే సినిమాకి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ.60 కోట్లు చెల్లిస్తామని డీల్ ఆఫర్ చేసిందట. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు తమకే ఇచ్చే విధంగా అమెజాన్ డీల్ మాట్లాడింది. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో సినిమాకి ఈ రేంజ్ లో ఆఫర్ రావడం మామూలు విషయం కాదు.

మంచి రేటు కావడంతో నిర్మాతలు కూడా డిజిటల్ హక్కులను అమ్మేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఆగస్టు 25న విడుదల చేస్తామని మేకర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మిలతో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఇందులో కీల‌క పాత్ర‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన కాంబినేషన్ సీన్స్ ను తెరకెక్కించడానికి చిత్రబృందం అమెరికాకు వెళ్లింది. 
ఈ సినిమా తరువాత విజయ్ తన తదుపరి సినిమా కూడా పూరి జగన్నాధ్ దర్శకత్వంలోనే చేయనున్నారు. మహేష్ బాబుతో చేయాలనుకున్న ‘జనగణమన’ ప్రాజెక్ట్ ను విజయ్ తో చేయబోతున్నారు. రీసెంట్ గా దీనిపై హింట్ కూడా ఇచ్చారు పూరి జగన్నాధ్. ఈ సినిమాలో కూడా కరణ్ జోహార్ భాగస్వామ్యం ఉంటుందని తెలుస్తోంది. 

This post was last modified on February 8, 2022 7:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

1 hour ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago