‘లైగర్’ డిజిటల్ రైట్స్.. ఫ్యాన్సీ రేటు!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. దానికి తగ్గట్లే సినిమాకి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ.60 కోట్లు చెల్లిస్తామని డీల్ ఆఫర్ చేసిందట. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు తమకే ఇచ్చే విధంగా అమెజాన్ డీల్ మాట్లాడింది. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో సినిమాకి ఈ రేంజ్ లో ఆఫర్ రావడం మామూలు విషయం కాదు.
మంచి రేటు కావడంతో నిర్మాతలు కూడా డిజిటల్ హక్కులను అమ్మేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఆగస్టు 25న విడుదల చేస్తామని మేకర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మిలతో కలిసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఆయన కాంబినేషన్ సీన్స్ ను తెరకెక్కించడానికి చిత్రబృందం అమెరికాకు వెళ్లింది.
ఈ సినిమా తరువాత విజయ్ తన తదుపరి సినిమా కూడా పూరి జగన్నాధ్ దర్శకత్వంలోనే చేయనున్నారు. మహేష్ బాబుతో చేయాలనుకున్న ‘జనగణమన’ ప్రాజెక్ట్ ను విజయ్ తో చేయబోతున్నారు. రీసెంట్ గా దీనిపై హింట్ కూడా ఇచ్చారు పూరి జగన్నాధ్. ఈ సినిమాలో కూడా కరణ్ జోహార్ భాగస్వామ్యం ఉంటుందని తెలుస్తోంది.
This post was last modified on February 8, 2022 7:47 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…