Movie News

ఆమె తప్పుకోవడంతో కొత్త బ్యూటీతో నాగ్


రొమాంటిక్ హీరోగా నాగార్జునకి ఉన్న ఇమేజే వేరు. అలాంటిది ఇప్పుడు ఆయనతో రొమాన్స్ చేయడానికి హీరోయిన్లను పట్టుకోవడం కష్టమవుతోంది. ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నప్పటికీ సీనియర్ హీరో కావడంతో ఆయనకు సూటయ్యే జోడీని వెతకడం దర్శక నిర్మాతలకు కాస్త కష్టంగానే ఉంది. ఆ సమస్య ‘ద ఘోస్ట్’ చిత్రాన్ని కూడా వెంటాడుతోంది.       

ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. కొన్నాళ్లు షూట్‌లో కూడా పాల్గొంది. అంతలో కన్సీవ్ అవ్వడంతో ఇక యాక్ట్ చేయలేనని చెప్పింది. యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ కావడం, స్టంట్స్ అవీ చేయాల్సి రావడంతో రిస్క్ తీసుకోకూడదని ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తప్పుకుంది. అప్పట్నుంచి హీరోయిన్ వేట కొనసాగుతూనే ఉంది.     

ఏవో తంటాలు పడి అమలాపాల్‌ని ఫిక్స్ చేస్తే.. ఆమె కూడా వాకౌట్ చేసేసింది. తను అడిగినంత ఇవ్వడానికి నిర్మాత ఒప్పుకోకపోవడమే దానికి కారణమని టాక్. ఏదైతేనేం.. మళ్లీ హీరోయిన్‌ కోసం సెర్చింగ్ స్టార్ట్ అయ్యింది. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ ఓకే అనుకున్నారు కానీ ఆమె ఓ కేసులో ఇరుక్కోవడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఎట్టకేలకి సోనాల్ చౌహాన్ దగ్గర వేట ఆగింది.      

బాలయ్య లాంటి స్టార్‌‌తో రెండు హిట్ సినిమాల్లో నటించిన సోనాల్.. ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్‌3’లో యాక్ట్ చేస్తోంది. నాగార్జునకి కూడా మంచి పెయిర్ అవుతుందనే ఉద్దేశంతో ఆమెనే ఫైనల్ చేశారట. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇందులో నాగ్‌తో పాటు సోనాల్‌ కూడా జాయినవనున్నట్లు తెలిసింది. కొంత పార్ట్ విదేశాల్లోనూ తీయాల్సి ఉంది. కానీ కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆ షెడ్యూల్‌ని వాయిదా వేస్తూ వస్తున్నారట.

This post was last modified on February 7, 2022 10:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago