పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో రాధేశ్యామ్ ఒకటి. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రను పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం యంగ్ సెన్సేషన్ తమన్ను రంగంలోకి దింపారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. రాధేశ్యామ్కు పైసా తీసుకోకుండా తమన్ పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగానే ఆయనే తెలియజేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్…. రాధేశ్యామ్ గొప్ప ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రం ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోతుందని నాకు అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా స్థాయికి నేను సరిపోను. అయినా నాపై ఉన్న నమ్మకంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయమని యూవీ క్రియేషన్స్ వారు నన్ను అడిగారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే నేను భావిస్తున్నాను
ఇంకా మాట్లాడుతూ.. రాధేశ్యామ్ పాన్ ఇండియా చిత్రం అయినప్పటికీ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకంటే, నా చేతిలో ఏ సినిమా లేక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు యూవీ క్రియేషన్స్ మహానుభావుడు, భాగమతి అవకాశాలు ఇచ్చింది. అందుకే వారి రుణం ఇలా తీర్చుకున్నా అంటూ తమన్ పేర్కొన్నారు. ఏదేమైనా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్న తమన్ ఓ పాన్ ఇండియా చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోకుండా పని చేయడం నిజంగా గ్రేటనే చెప్పాలి.
This post was last modified on February 7, 2022 2:18 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…