మాస్ మహరాజా రవితేజ గత ఏడాది క్రాక్తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ ఊపులో ఇంకొన్ని నెలలకే ఖిలాడి సినిమాను దించాలనుకున్నాడు. కానీ కరోనా మహమ్మారి అతడి ప్రణాళికలకు బ్రేక్ వేసింది. అనుకున్న సమయం కన్నా దాదాపు పది నెలలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు కూడా ఆ చిత్రానికి అంత అనుకూల పరిస్థితులేమీ లేవు. కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ ఈ నెల 11న ఖిలాడి మూవీని రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ, 50 పర్సంట్ ఆక్యుపెన్సీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో చిత్ర బృందంలో అయోమయం నెలకొంది. ప్రస్తుతానికి ఈ నెల 14 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండబోతోంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. నైట్ కర్ఫ్యూ ఉంటే సెకండ్ షోలకు ఇబ్బంది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉఉన్నా కూడా క్రాక్ మూవీ భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో అదేమంత ఇబ్బంది కాదనుకుంటున్నారు.
కానీ సెకండ్ షోలు లేకుంటే మాత్రం వసూళ్లపై మరింత ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో సినిమాను ఇంకో వారం వాయిదా వేయాలని ఒక దశలో చర్చ జరిగింది. హీరో రవితేజ ఆ విషయంలో కొంచెం పట్టుదలతోనే ఉన్నాడట.
కానీ ఫిబ్రవరి 25కు మూణ్నాలుగు సినిమాలు షెడ్యూల్ అయి ఉండటంతో ఖిలాడి రన్ వారానికే ఆగిపోతుందని.. 11న రిలీజ్ చేస్తే రెండు వారాల పాటు పెద్దగా పోటీ లేకుండా సినిమాను నడిపించుకోవచ్చని, హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 25న వచ్చే గంగూబాయి మూవీతో ఇబ్బంది ఉండదని.. అందుకే ఏపీ సంగతి పక్కన పెట్టేసి సినిమాను 11నే రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు డిసైడైపోయారు. ఈ నేపథ్యంలో రవితేజకు ఇష్టం లేకున్నా 11న రిలీజ్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి అనుకున్న ప్రకారమే సినిమా రిలీజవుతుందే లేదో చూడాలి.
This post was last modified on February 6, 2022 11:30 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…