మాస్ మహరాజా రవితేజ గత ఏడాది క్రాక్తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ ఊపులో ఇంకొన్ని నెలలకే ఖిలాడి సినిమాను దించాలనుకున్నాడు. కానీ కరోనా మహమ్మారి అతడి ప్రణాళికలకు బ్రేక్ వేసింది. అనుకున్న సమయం కన్నా దాదాపు పది నెలలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు కూడా ఆ చిత్రానికి అంత అనుకూల పరిస్థితులేమీ లేవు. కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ ఈ నెల 11న ఖిలాడి మూవీని రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ, 50 పర్సంట్ ఆక్యుపెన్సీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో చిత్ర బృందంలో అయోమయం నెలకొంది. ప్రస్తుతానికి ఈ నెల 14 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండబోతోంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. నైట్ కర్ఫ్యూ ఉంటే సెకండ్ షోలకు ఇబ్బంది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉఉన్నా కూడా క్రాక్ మూవీ భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో అదేమంత ఇబ్బంది కాదనుకుంటున్నారు.
కానీ సెకండ్ షోలు లేకుంటే మాత్రం వసూళ్లపై మరింత ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో సినిమాను ఇంకో వారం వాయిదా వేయాలని ఒక దశలో చర్చ జరిగింది. హీరో రవితేజ ఆ విషయంలో కొంచెం పట్టుదలతోనే ఉన్నాడట.
కానీ ఫిబ్రవరి 25కు మూణ్నాలుగు సినిమాలు షెడ్యూల్ అయి ఉండటంతో ఖిలాడి రన్ వారానికే ఆగిపోతుందని.. 11న రిలీజ్ చేస్తే రెండు వారాల పాటు పెద్దగా పోటీ లేకుండా సినిమాను నడిపించుకోవచ్చని, హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 25న వచ్చే గంగూబాయి మూవీతో ఇబ్బంది ఉండదని.. అందుకే ఏపీ సంగతి పక్కన పెట్టేసి సినిమాను 11నే రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు డిసైడైపోయారు. ఈ నేపథ్యంలో రవితేజకు ఇష్టం లేకున్నా 11న రిలీజ్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి అనుకున్న ప్రకారమే సినిమా రిలీజవుతుందే లేదో చూడాలి.
This post was last modified on February 6, 2022 11:30 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…