మాస్ మహరాజా రవితేజ గత ఏడాది క్రాక్తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ ఊపులో ఇంకొన్ని నెలలకే ఖిలాడి సినిమాను దించాలనుకున్నాడు. కానీ కరోనా మహమ్మారి అతడి ప్రణాళికలకు బ్రేక్ వేసింది. అనుకున్న సమయం కన్నా దాదాపు పది నెలలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు కూడా ఆ చిత్రానికి అంత అనుకూల పరిస్థితులేమీ లేవు. కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ ఈ నెల 11న ఖిలాడి మూవీని రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ, 50 పర్సంట్ ఆక్యుపెన్సీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో చిత్ర బృందంలో అయోమయం నెలకొంది. ప్రస్తుతానికి ఈ నెల 14 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండబోతోంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. నైట్ కర్ఫ్యూ ఉంటే సెకండ్ షోలకు ఇబ్బంది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉఉన్నా కూడా క్రాక్ మూవీ భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో అదేమంత ఇబ్బంది కాదనుకుంటున్నారు.
కానీ సెకండ్ షోలు లేకుంటే మాత్రం వసూళ్లపై మరింత ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో సినిమాను ఇంకో వారం వాయిదా వేయాలని ఒక దశలో చర్చ జరిగింది. హీరో రవితేజ ఆ విషయంలో కొంచెం పట్టుదలతోనే ఉన్నాడట.
కానీ ఫిబ్రవరి 25కు మూణ్నాలుగు సినిమాలు షెడ్యూల్ అయి ఉండటంతో ఖిలాడి రన్ వారానికే ఆగిపోతుందని.. 11న రిలీజ్ చేస్తే రెండు వారాల పాటు పెద్దగా పోటీ లేకుండా సినిమాను నడిపించుకోవచ్చని, హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 25న వచ్చే గంగూబాయి మూవీతో ఇబ్బంది ఉండదని.. అందుకే ఏపీ సంగతి పక్కన పెట్టేసి సినిమాను 11నే రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు డిసైడైపోయారు. ఈ నేపథ్యంలో రవితేజకు ఇష్టం లేకున్నా 11న రిలీజ్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి అనుకున్న ప్రకారమే సినిమా రిలీజవుతుందే లేదో చూడాలి.
This post was last modified on February 6, 2022 11:30 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…