మాస్ మహరాజా రవితేజ గత ఏడాది క్రాక్తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ ఊపులో ఇంకొన్ని నెలలకే ఖిలాడి సినిమాను దించాలనుకున్నాడు. కానీ కరోనా మహమ్మారి అతడి ప్రణాళికలకు బ్రేక్ వేసింది. అనుకున్న సమయం కన్నా దాదాపు పది నెలలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు కూడా ఆ చిత్రానికి అంత అనుకూల పరిస్థితులేమీ లేవు. కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ ఈ నెల 11న ఖిలాడి మూవీని రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ, 50 పర్సంట్ ఆక్యుపెన్సీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో చిత్ర బృందంలో అయోమయం నెలకొంది. ప్రస్తుతానికి ఈ నెల 14 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండబోతోంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. నైట్ కర్ఫ్యూ ఉంటే సెకండ్ షోలకు ఇబ్బంది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉఉన్నా కూడా క్రాక్ మూవీ భారీ వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో అదేమంత ఇబ్బంది కాదనుకుంటున్నారు.
కానీ సెకండ్ షోలు లేకుంటే మాత్రం వసూళ్లపై మరింత ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో సినిమాను ఇంకో వారం వాయిదా వేయాలని ఒక దశలో చర్చ జరిగింది. హీరో రవితేజ ఆ విషయంలో కొంచెం పట్టుదలతోనే ఉన్నాడట.
కానీ ఫిబ్రవరి 25కు మూణ్నాలుగు సినిమాలు షెడ్యూల్ అయి ఉండటంతో ఖిలాడి రన్ వారానికే ఆగిపోతుందని.. 11న రిలీజ్ చేస్తే రెండు వారాల పాటు పెద్దగా పోటీ లేకుండా సినిమాను నడిపించుకోవచ్చని, హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 25న వచ్చే గంగూబాయి మూవీతో ఇబ్బంది ఉండదని.. అందుకే ఏపీ సంగతి పక్కన పెట్టేసి సినిమాను 11నే రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు డిసైడైపోయారు. ఈ నేపథ్యంలో రవితేజకు ఇష్టం లేకున్నా 11న రిలీజ్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి అనుకున్న ప్రకారమే సినిమా రిలీజవుతుందే లేదో చూడాలి.
This post was last modified on February 6, 2022 11:30 pm
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…