తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్-సావిత్రిల జంట ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ‘మిస్సమ్మ’, ‘గుండమ్మ కథ’ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు. వెండితెరపై వీరి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది. అలాంటి వీరిద్దరూ ‘రక్తసంబంధం’ సినిమాలో మాత్రం అన్నాచెల్లెళ్లుగా కనిపించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఎమోషనల్ పెర్ఫార్మన్స్ కళ్లు చెమ్మగిల్లేలా చేస్తుంది.
అటు జంటగా కనిపించి మెప్పించడంతో పాటు.. ఇటు అన్నాచెల్లెళ్లుగా నటించి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఓ రేర్ ఫీట్ ను రిపీట్ చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో తనకు జంటగా నటించిన నయనతారను తన కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’లో సిస్టర్ రోల్ కోసం తీసుకున్నారు చిరు.
కథను బట్టి సినిమాలో వీరిద్దరి మధ్య పెద్దగా అనుబంధం ఉండదు. చిరుని అపార్ధం చేసుకొని.. అతడిని దూరం పెడుతుంటుంది నయన్. ఫైనల్ గా చెల్లెలు కష్టంలో ఉందని తెలుసుకొని ఆమెని కాపాడే సీన్ లో హీరో కనిపిస్తాడు. ఈ సన్నివేశాలన్నీ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. మరి ఇలాంటి కథలో చిరు-నయన్.. అప్పట్లో ఎన్టీఆర్-సావిత్రి క్రియేట్ చేసిన రేర్ ఫీట్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి!
ప్రస్తుతం నయనతార ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది. నయన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం నుంచి చిరంజీవి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు. నయనతారతో కాంబినేషన్ సీన్స్ లో చిరు నటిస్తారని సమాచారం. మలయాళంలో తెరకెక్కిన ‘లూసిఫర్’ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
This post was last modified on February 5, 2022 3:45 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…