Movie News

ఎన్టీఆర్‌తో మ‌హేష్ డైరెక్ట‌ర్ మ‌ల్టీస్టార‌ర్‌..?


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నారు. ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌`ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో, ఆపై చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్‌తో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ రెండిటి త‌ర్వాత `ఉప్పెన‌`తో బ్లాక్ బస్ట‌ర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్ట‌ర్‌ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే తాజాగా ఎన్టీఆర్ లిస్ట్‌లో మ‌రో ద‌ర్శ‌కుడు వ‌చ్చి చేరాడు. ఆయ‌నెవ‌రో కాదు ప‌రుశురామ్‌. ఇప్పుడీయ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నాడు. ఇందులో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో మే 12న‌ విడుద‌ల కానుంది.

అయితే ఈ సినిమా త‌ర్వాత ప‌రుశురామ్ ఎన్టీఆర్‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఓ అదిరిపోయే లైన్‌ను కూడా ఎన్టీఆర్‌కి వినిపించ‌గా.. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చింద‌ట‌. అంతేకాదు, ఎన్టీఆర్ ప‌రుశురామ్‌కు పూర్తి స్థాయిలో కథ సిద్దం చేయమని కూడా సూచించార‌ట‌.

ఇక వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించ‌బోతోంద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఒక‌వేళ నిజంగానే ఎన్టీఆర్‌, ప‌రుశురామ్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ ఖ‌రారైతే.. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై ప్ర‌క‌ట‌న వ‌స్తుంది.

This post was last modified on February 5, 2022 2:41 pm

Share

Recent Posts

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

21 minutes ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

25 minutes ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

1 hour ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

1 hour ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

2 hours ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

3 hours ago