యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్`ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో, ఆపై చిత్రాన్ని ప్రశాంత్ నీల్తో చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ రెండిటి తర్వాత `ఉప్పెన`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా ఎన్టీఆర్ లిస్ట్లో మరో దర్శకుడు వచ్చి చేరాడు. ఆయనెవరో కాదు పరుశురామ్. ఇప్పుడీయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం సమ్మర్లో మే 12న విడుదల కానుంది.
అయితే ఈ సినిమా తర్వాత పరుశురామ్ ఎన్టీఆర్తో ఓ మల్టీస్టారర్ చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ అదిరిపోయే లైన్ను కూడా ఎన్టీఆర్కి వినిపించగా.. అది ఆయనకు బాగా నచ్చిందట. అంతేకాదు, ఎన్టీఆర్ పరుశురామ్కు పూర్తి స్థాయిలో కథ సిద్దం చేయమని కూడా సూచించారట.
ఇక వీరి కాంబోలో తెరకెక్కబోయే మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించబోతోందని టాక్ నడుస్తోంది. మరి ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్, పరుశురామ్ కాంబోలో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఖరారైతే.. త్వరలోనే ఈ సినిమాపై ప్రకటన వస్తుంది.
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…