Movie News

ఎన్టీఆర్‌తో మ‌హేష్ డైరెక్ట‌ర్ మ‌ల్టీస్టార‌ర్‌..?


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నారు. ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌`ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో, ఆపై చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్‌తో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ రెండిటి త‌ర్వాత `ఉప్పెన‌`తో బ్లాక్ బస్ట‌ర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్ట‌ర్‌ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే తాజాగా ఎన్టీఆర్ లిస్ట్‌లో మ‌రో ద‌ర్శ‌కుడు వ‌చ్చి చేరాడు. ఆయ‌నెవ‌రో కాదు ప‌రుశురామ్‌. ఇప్పుడీయ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నాడు. ఇందులో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో మే 12న‌ విడుద‌ల కానుంది.

అయితే ఈ సినిమా త‌ర్వాత ప‌రుశురామ్ ఎన్టీఆర్‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఓ అదిరిపోయే లైన్‌ను కూడా ఎన్టీఆర్‌కి వినిపించ‌గా.. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చింద‌ట‌. అంతేకాదు, ఎన్టీఆర్ ప‌రుశురామ్‌కు పూర్తి స్థాయిలో కథ సిద్దం చేయమని కూడా సూచించార‌ట‌.

ఇక వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించ‌బోతోంద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఒక‌వేళ నిజంగానే ఎన్టీఆర్‌, ప‌రుశురామ్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ ఖ‌రారైతే.. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై ప్ర‌క‌ట‌న వ‌స్తుంది.

Satya

Recent Posts

తెలంగాణలో జనసేన సింగిల్ గా గర్జిస్తుందా?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…

1 hour ago

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

6 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

9 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

11 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

11 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

11 hours ago