యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్`ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో, ఆపై చిత్రాన్ని ప్రశాంత్ నీల్తో చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ రెండిటి తర్వాత `ఉప్పెన`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా ఎన్టీఆర్ లిస్ట్లో మరో దర్శకుడు వచ్చి చేరాడు. ఆయనెవరో కాదు పరుశురామ్. ఇప్పుడీయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం సమ్మర్లో మే 12న విడుదల కానుంది.
అయితే ఈ సినిమా తర్వాత పరుశురామ్ ఎన్టీఆర్తో ఓ మల్టీస్టారర్ చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ అదిరిపోయే లైన్ను కూడా ఎన్టీఆర్కి వినిపించగా.. అది ఆయనకు బాగా నచ్చిందట. అంతేకాదు, ఎన్టీఆర్ పరుశురామ్కు పూర్తి స్థాయిలో కథ సిద్దం చేయమని కూడా సూచించారట.
ఇక వీరి కాంబోలో తెరకెక్కబోయే మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించబోతోందని టాక్ నడుస్తోంది. మరి ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్, పరుశురామ్ కాంబోలో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఖరారైతే.. త్వరలోనే ఈ సినిమాపై ప్రకటన వస్తుంది.
This post was last modified on February 5, 2022 2:41 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…