‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. స్టార్ డైరెక్టర్ లేకపోయినా.. ఆయన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ.. వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. ‘సాహో’ సినిమాను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మార్చి 11న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాను రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేశారు. నిజానికి ఆయన తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేశారు. అలాంటిది ‘రాధేశ్యామ్’ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో డిమాండ్ పెరిగిందంటే దానికి కారణం ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాను 6000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్స్ లో ఈ సినిమా విడుదలవుతుందట. ఈ రేంజ్ లో స్క్రీన్స్ దక్కాయంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధమవుతుంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ మొత్తం కలుపుకుంటే ‘రాధేశ్యామ్’ రూ.230 కోట్లు రాబట్టింది. హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకోగా.. మిగిలిన భాషల శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది.
‘బాహుబలి’ తరువాత మళ్లీ ఆ రేంజ్ రికార్డ్ డీల్ ‘రాధేశ్యామ్’ సినిమాకే వచ్చింది. ఇదంతా కూడా కేవలం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టామినా వలనే సాద్యమైంది. ప్రస్తుతం ఈ హీరో ‘ఆదిపురుష్’, ‘సలార్’ వంటి సినిమాలను లైన్ లో పెట్టాడు. అలానే ‘స్పిరిట్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల్లో కూడా నటించనున్నారు.
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…