Movie News

ప్రభాస్ స్టామినా ఇది..!

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. స్టార్ డైరెక్టర్ లేకపోయినా.. ఆయన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ.. వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. ‘సాహో’ సినిమాను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మార్చి 11న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ సినిమాను రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేశారు. నిజానికి ఆయన తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేశారు. అలాంటిది ‘రాధేశ్యామ్’ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో డిమాండ్ పెరిగిందంటే దానికి కారణం ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాను 6000 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. 

ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్స్ లో ఈ సినిమా విడుదలవుతుందట. ఈ రేంజ్ లో స్క్రీన్స్ దక్కాయంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధమవుతుంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ మొత్తం కలుపుకుంటే ‘రాధేశ్యామ్’ రూ.230 కోట్లు రాబట్టింది. హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకోగా.. మిగిలిన భాషల శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. 

‘బాహుబలి’ తరువాత మళ్లీ ఆ రేంజ్ రికార్డ్ డీల్ ‘రాధేశ్యామ్’ సినిమాకే వచ్చింది. ఇదంతా కూడా కేవలం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టామినా వలనే సాద్యమైంది. ప్రస్తుతం ఈ హీరో ‘ఆదిపురుష్’, ‘సలార్’ వంటి సినిమాలను లైన్ లో పెట్టాడు. అలానే ‘స్పిరిట్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాల్లో కూడా నటించనున్నారు. 

This post was last modified on February 4, 2022 5:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago