Movie News

అల్లరోడి సినిమా ఆగిపోయిందా?

చాలా ఏళ్ల తర్వాత ‘నాంది’ సినిమాతో సోలో హీరోగా మంచి విజయాన్నందుకున్నాడు అల్లరి నరేష్. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒకప్పుడు కామెడీతో అలరించిన నరేష్.. ఈసారి మాత్రం సీరియస్ మూవీతో మెప్పించి విజయాన్నందుకున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత దక్కిన ఈ విజయం అల్లరోడిని అమితానందానికి గురి చేసింది. హిట్టు కొట్టేశాం కదా అని తొందరపడిపోకుండా అతను ఆచితూచే వ్యవహరించాడు.

కొంచెం గ్యాప్ తీసుకుని ‘సభకు నమస్కారం’ అనే సినిమాను లైన్లో పెట్టాడు. పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్, నందమూరి బ్రదర్స్ జూనియర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్‌లకు అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు ప్రొడక్షన్లో ఈ సినిమా మొదలైంది. సతీష్ మల్లంపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాల్సింది.

గత ఏడాది మధ్యలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్నట్లు అప్‌డేట్ ఇచ్చారు. తర్వాత ఏ సమాచారం లేదు.కొన్ని నెలలకే నిర్మాత మహేష్ కోనేరు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఆయన దీంతో పాటుగా మరికొన్ని చిత్రాల నిర్మాణానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్న దశలో ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది. షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే నిర్మాత చనిపోవడంతో ఈ సినిమా హోల్డ్‌లో పడింది. ఇంకో కొత్త నిర్మాత రంగంలోకి దిగితే తప్ప సినిమా ముందుకు కదిలే పరిస్థితి లేదు.

దీంతో దాన్ని అలా పక్కన పెట్టి నరేష్ ఇప్పుడు కొత్త సినిమాను మొదలుపెడుతున్నాడు. హాస్య మూవీస్ అనే కొత్త బేనర్, జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఏఆర్ మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మంగళవారమే ఈ చిత్రానికి ముహూర్తం పూర్తి చేశారు. దీంతో పాటే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతోంది. కొన్ని నెలలుగా ‘సభకు నమస్కారం’ గురించి సమాచారం ఏదీ లేని నేపథ్యంలో ఈ చిత్రం ఆగిపోయినట్లేనని భావిస్తున్నారు. 

This post was last modified on February 1, 2022 7:10 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

40 mins ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

1 hour ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

1 hour ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

4 hours ago