అల్లు అర్జున్, సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా థియేట్రికల్ రన్ ఎప్పుడో అయిపోయిందనే అనుకుంటున్నారు అంతా. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మూడు వారాల కిందటే అమేజాన్ ప్రైమ్లో రిలీజైపోయింది. దీంతో ఈ భాషలన్నింట్లో దాని థియేట్రికల్ రన్ ముగిసిన మాట వాస్తవం. సంక్రాంతి టైంలో హిందీ వెర్షన్ కూడా ప్రైమ్లో రిలీజైపోవడంతో ఆ భాషలో వసూళ్లకు తెరపడినట్లే అనుకున్నారు.
కానీ ప్రైమ్లో రిలీజయ్యాక కూడా ‘పుష్ఫ’ థియేటర్లలో సత్తా చాటడం విశేషం. అంతకుముందులా కాకపోయినా ఓ మోస్తరుగా వసూళ్లు కొనసాగాయి. నార్త్ ఇండియాలో రూరల్ ఏరియాల్లో ఈ సినిమా వసూళ్లు కొనసాగాయి. ప్రైమ్లో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో ఈ సినిమాను చూడ్డానికి ఆసక్తి ప్రదర్శించారు అక్కడి ప్రేక్షకులు. దీంతో తర్వాతి రెండు వారాల్లోనూ ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్లు వచ్చాయి.
ఇప్పుడీ చిత్రం హిందీలో రూ.100 కోట్ల నెట్ వసూళ్ల మార్కును అందుకోవడం విశేషం. ప్రైమ్లో రిలీజవ్వడానికి ముందు ‘పుష్ప’ హిందీ వెర్షన్ వసూళ్లు రూ.86-87 కోట్ల మధ్య ఉన్నాయి. కాబట్టి 90 కోట్ల వద్ద రన్ ముగుస్తుందని అనుకున్నారు. కానీ గత రెండు వారాల్లో ఓ మోస్తరు వసూళ్లతో నడిచిన సినిమా ఎట్టకేలకు రూ.100 కోట్ల మార్కును టచ్ చేసింది. ప్రైమ్లో అందుబాటులో ఉన్నా కూడా ఇలా కలెక్షన్లు రాబట్టి వంద కోట్ల మార్కును అందుకోవడం గొప్ప విషయమే.
‘పుష్ప’ నార్త్ ఇండియాలో ఏ స్థాయిలో సంచలనం రేపిందో చెప్పడానికి ఇది రుజువు. ఈ సినిమాను హిందీ మార్కెట్లో రిలీజ్ చేసిన గోల్డ్ మైన్ ఫిలిమ్స్ వారికి నిజంగా గోల్డ్ మైన్ దొరికినట్లే అయింది. కేవలం పది కోట్లకే ఈ సినిమా హిందీ హక్కులను సొంతం చేసుకుందా సంస్థ. ‘పుష్ప’ నిర్మాతలకు ఇది కొంత బాధ కలిగించే విషయమే అయినా.. ‘పుష్ప-2’ బిజినెస్కు మాత్రం ఇది బాగా కలిసొచ్చేదే. సెకండ్ పార్ట్ హిందీ వరకే రూ.100 కోట్లు పలికినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on January 31, 2022 9:55 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…