దేశంలో కరోనా మూడో వేవ్ తీవ్రత అనుకున్న స్థాయిలో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నార. కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నప్పటికీ.. వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం అయితే చూపించట్లేదన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో వ్యాపారాలకు సమస్య లేకపోయింది. ప్రస్తుతానికి థియేటర్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ.. సుదీర్ఘ కాలం ఆంక్షలు కొనసాగేలా లేవు.
మునుపటిలా థియేటర్లు మూతపడతాయన్న భయం కూడా లేదు. ముఖ్యంగా వేసవి సీజన్ వృథా అయిపోతుందేమో అన్న కంగారైతే కనిపించడం లేదు ఎవరిలోనూ. వచ్చే నెల చివరికల్లా థియేటర్లు మునుపటిలా నడుస్తాయన్న అంచనాల నేపథ్యంలో ప్రస్తుతానికి వాయిదా పడ్డ భారీ చిత్రాలు విడుదల సన్నాహాల్లో పడ్డాయి. వాటిలో ముందుగా ప్రేక్షకులను పలకరించే సినిమా రాధేశ్యామ్యే కావచ్చని సమాచారం.
ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ రావడం డౌటే కాగా.. ఆర్ఆర్ఆర్ విడుదల ఏప్రిల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నార. ఐతే రాధేశ్యామ్ మాత్రం థియేటర్లు పూర్తి స్థాయిలో నడవడం మొదలవగానే రిలీజ్ అయిపోతుందట. ప్రస్తుతానికి ఈ చిత్రానికి రెండు డేట్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మార్చి 4న లేదంటే 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని చూస్తున్నారు.
ముందు మార్చి 18వ తేదీకి అనుకున్నప్పటికీ.. దివంగత పునీత్ రాజ్ కుమార్ మూవీ జేమ్స్ ఆ రోజే రిలీజవుతుండటంతో దానికి పోటీగా కర్ణాటకలో తమ చిత్రాన్ని రిలీజ్ చేయడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో సినిమాను ప్రి పోన్ చేశారట. పైగా పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతుండటంతో మార్చి తొలి లేదా రెండో వారంలో రాధేశ్యామ్ను రిలీజ్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదనే భావిస్తున్నారు.
This post was last modified on January 31, 2022 10:07 am
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…