కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నా.. వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఏమీ ఉండట్లేదు. పరిస్థితి విషమించి, ప్రాణాలు పోతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ను అందరూ లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. అన్ని వ్యాపారాలు యధావిధిగా నడుస్తున్న నేపథ్యంలో సినిమాల ప్రదర్శన విషయంలోనూ ధైర్యం వస్తోంది. ప్రస్తుతానికి బాక్సాఫీస్ డల్లుగా ఉన్నప్పటికీ.. ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండదని అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరిలో పేరున్న సినిమాల విడుదలకు చురుగ్గా సన్నాహాలు జరుగుతుండటం.. ఒకదాని తర్వాత ఒక సినిమాకు రిలీజ్ డేట్ ఇస్తుండటం గమనార్హం. ఫిబ్రవరి 11 నుంచి వాయిదా పడుతుందనుకున్న ఖిలాడి మూవీని అదే తేదీకి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేస్తుండగా.. 4వ తేదీకి డీజే టిల్లు ఖరారైంది. 25వ తేదీన విడుదల అంటూ ఆడవాళ్ళు మీకు జోహార్లు టీం ప్రకటన ఇచ్చింది.
కాగా ఇప్పుడు ఫిబ్రవరి విడుదలకు మరో సినిమా రెడీ అయిపోయింది. విశాల్ కొత్త సినిమా సామాన్యుడు (తమిళంలో వీరమే వాగై సూడుం)ను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ముందు ఈ సినిమాను సంక్రాంతి రేసులో నిలిపారు. తర్వాత జనవరి 26కు వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి కూడా రాలేదు.
కొవిడ్ కారణంగానే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని.. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తెచ్చేయడానికి విశాల్ రెడీ అయ్యాడు. ఇటీవలే దీని ట్రైలర్ కూడా లాంచ్ చేయడం తెలిసిందే. విశాల్ స్టయిల్లో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తు.ప.శరవణన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. విశాల్ సరసన ఖిలాడి భామ డింపుల్ హయతి నటించింది. విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
This post was last modified on January 30, 2022 2:23 pm
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…