ఇప్పుడు వెబ్ సిరీస్ల హవా ఎలా నడుస్తోందో తెలిసిందే. కరోనా టైంలో ఓటీటీల జోరు పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున వాటి కోసం ఒరిజినల్స్ తయారవుతున్నాయి. ఇంతకుముందు వెబ్ సిరీస్లను తక్కువగా చూసిన స్టార్లు ఒక్కొక్కరుగా ఇప్పుడు అటు వైపు అడుగులు వేస్తున్నారు. దక్షిణాది టాప్ హీరోయిన్లలో కాజల్, తమన్నా, సమంత.. వీళ్లంతా వెబ్ సిరీస్లు చేసిన వాళ్లే.
శ్రుతి హాసన్ విషయానికి వస్తే.. ఆమె పిట్టకథలు అనే ఆంథాలజీ వెబ్ ఫిలింలో నటించింది. కానీ అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆమె నటించిన సెగ్మెంట్ తుస్సుమనిపించింది. తర్వాత మళ్లీ వెబ్ సిరీస్లు, ఫిలిమ్స్ వైపు చూడలేదు శ్రుతి. కానీ ఇప్పుడు ఆమె మరోసారి ఇందులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. శ్రుతి ప్రధాన పాత్రలో ఒక ఫుల్ లెంగ్త్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే.. బెస్ట్ సెల్లర్.
శ్రుతితో పాటు ప్రేమలో పావని కళ్యాణ్, సంపంగి, అరుంధతి లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన హిందీ నటుడు దీపక్ బెస్ట్ సెల్లర్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రచయిత రవి సుబ్రహ్మణియన్ రాసిన పాపులర్ నవల బెస్ట్ సెల్లర్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అమేజాన్ ప్రైమ్ ఈ సిరీస్ను ప్రొడ్యూస్ చేసింది.
ఫిబ్రవరి 18న బెస్ట్ సెల్లర్ ప్రిమియర్స్ పడనున్నాయి. ఇందులో శ్రుతి జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలోనే కనిపించబోతోంది శ్రుతి. మరి షార్ట్ టెర్మ్ డిజిటల్ డెబ్యూలో అంతగా ఆకట్టుకోలేకపోయిన శ్రుతి.. ఫుల్ లెంగ్త్ వెబ్ సిరీస్లో ఏమేర మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన సలార్ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 30, 2022 9:02 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…