90వ దశకంలో తెలుగు సినిమాల్లో మెరిసిన కథానాయికల్లో మహేశ్వరి ఒకరు. శ్రీదేవి కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి యావరేజ్ అందచందాలతోనే మంచి మంచి అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా జేడీ చక్రవర్తితో కలిసి చేసిన గులాబి, దెయ్యం.. వడ్డే నవీన్ సరసన నటించిన ‘పెళ్లి’.. రవితేజతో నటించిన ‘నీకోసం’ సినిమాలు చూసిన వాళ్లు మహేశ్వరిని అంత సులువుగా మరిచిపోలేరు.
చివరగా ‘మా అన్నయ్య’ సినిమాలో నటించిన మహేశ్వరి ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. మధ్యలో ‘మై నేమ్ ఈజ్ మంగతాయారు’ అనే టీవీ సీరియల్లో కనిపించి ఆ తర్వాత ఆమె మాయమైపోయింది. చాలా ఏళ్ల నుంచి లైమ్ లైట్లో లేని మహేశ్వరి.. తాజాగా కమెడియన్ ఆలీ నిర్వహించే టీవీ షోకు అతిథిగా వచ్చింది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడింది.అందరూ మహేశ్వరిని.. శ్రీదేవి చెల్లెలు అనుకుంటూ ఉంటారని.. కానీ తాను శ్రీదేవి చెల్లెల్ని కాదని చెప్పింది మహేశ్వరి.
శ్రీదేవి తన తల్లికి చెల్లెలు అని, అంటే తనకు పిన్ని అని… కానీ తమ ఇద్దరికీ వయసు అంతరం తక్కువగా ఉండటంతో ఆమెను తాను అక్క అనేదాన్నని.. ఇండస్ట్రీ వాళ్లు కూడా అది చూసి తాను ఆమెకు చెల్లెలు అనుకున్నారని.. ఇదే ప్రచారంలో ఉండిపోయిందని మహేశ్వరి చెప్పింది. శ్రీదేవి ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినా తన ఇంటికి వచ్చి ఎంతో ఆప్యాయంగా ఉండేదని.. ఆమె చనిపోయిందనే విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మట్లేదని.. షూటింగ్ కోసం ఫారిన్లో ఉందనే ఆలోచనలోనే ఉన్నానని మహేశ్వరి తెలిపింది.
ఇక తన సినిమా అనుభవాలకు సంబంధించి ఒక ఆసక్తిర విషయాన్ని మహేశ్వరి పంచుకుంది. రామ్ గోపాల్ వర్మ తనకు పాతికేళ్ల కిందట 50 వేలు బాకీ పడ్డాడని.. ఆ డబ్బులు ఇప్పటికీ అడుగుతుంటానని మహేశ్వరి వెల్లడించింది. ‘దెయ్యం’ సినిమా షూటింగ్ ఒకసారి అర్ధరాత్రి వేళ శ్మశానంలో చేశారని.. ఆ టైంలో వర్మ వచ్చి ఎవరైనా ఒంటిరిగా ఇక్కడి నుంచి రోడ్డు వరకు వెళ్లి వస్తే రూ.50 వేలు ఇస్తానని సవాల్ చేశారని.. తాను రాత్రి ఒంటి గంటకు ఒంటరిగా రోడ్డు వరకు వెళ్లి వచ్చానని.. అందరూ షాకయ్యారని.. కానీ వర్మ ఇచ్చిన మాట ప్రకారం 50 వేలు ఇవ్వనే లేదని మహేశ్వరి తెలిపింది.
This post was last modified on January 27, 2022 7:34 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…