Movie News

‘పుష్ప’, ‘శ్యామ్ సింగరాయ్’.. ఓ బావి స్టోరీ!

మన దర్శకనిర్మాతలు సినిమా సెట్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ విషయంలో ఆర్ట్స్ డైరెక్టర్స్ తెలివిగా ఆలోచిస్తే.. ఓ కోట్ల ఖర్చుని తగ్గించుకోవచ్చు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కలను స్మగుల్ చేసే పాత్రలో కనిపించాడు. సినిమా మొదలైన కాసేపటికే గంధపు చెక్కలున్న లారీను హీరో బావిలోకి నెట్టేస్తాడు. ఈ ఒక్క సీన్ కోసం నిర్మాతలు ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. 

ఈ ఒక్క సీన్ కోసం ప్రత్యేకంగా బావిని తవ్వారట. సీన్ రియలిస్టిక్ గా రావడం కోసం మొత్తం రెండు కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి నిర్మాతలు ఒక్క సీన్ కోసం అంత ఖర్చు పెట్టారు. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కూడా ఓ బావి సీన్ ఉంటుంది గుర్తుందా..? అంటరానితనం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు బ్రాహ్మణులు వాడే నీటి బావిలోకి ఒక దళితుడిని తోసేస్తాడు హీరో నాని. 

సినిమాలో ఈ సీన్ హైలైట్ గా నిలిచింది. మనుషులంతా ఒక్కటే అని.. తాగే నీటికి, పీల్చే గాలికి జాతి, మతంతో సంబంధం లేదని మెసేజ్ ఇచ్చే సీన్ అది. ఈ సీన్ కోసం నిర్మాతలు ఎంత ఖర్చు చేశారో తెలుసా..? రూ.20 వేలు. బావి కోసం చిన్న సెట్ వేసి, ఆర్ట్ వర్క్ తో సీజీని కలిపి చాలా నేచురల్ గా సీన్ వచ్చేలా చిత్రీకరించారు. 

అల్లు అర్జున్ రేంజ్ కాబట్టి రూ.2 కోట్లు ఖర్చు చేశారు. నాని సినిమా బడ్జెట్ ముప్పై కోట్ల లోపే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో మరింత ఇంపాక్ట్ గా సీన్ యూ డిజైన్ చేశారు. ఏది ఏమైనా.. ఈ బావి కాన్సెప్ట్ మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం. 

This post was last modified on January 27, 2022 5:50 pm

Share

Recent Posts

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

2 hours ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

4 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

6 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

9 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

11 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

12 hours ago