మన దర్శకనిర్మాతలు సినిమా సెట్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ విషయంలో ఆర్ట్స్ డైరెక్టర్స్ తెలివిగా ఆలోచిస్తే.. ఓ కోట్ల ఖర్చుని తగ్గించుకోవచ్చు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కలను స్మగుల్ చేసే పాత్రలో కనిపించాడు. సినిమా మొదలైన కాసేపటికే గంధపు చెక్కలున్న లారీను హీరో బావిలోకి నెట్టేస్తాడు. ఈ ఒక్క సీన్ కోసం నిర్మాతలు ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.
ఈ ఒక్క సీన్ కోసం ప్రత్యేకంగా బావిని తవ్వారట. సీన్ రియలిస్టిక్ గా రావడం కోసం మొత్తం రెండు కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి నిర్మాతలు ఒక్క సీన్ కోసం అంత ఖర్చు పెట్టారు. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కూడా ఓ బావి సీన్ ఉంటుంది గుర్తుందా..? అంటరానితనం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు బ్రాహ్మణులు వాడే నీటి బావిలోకి ఒక దళితుడిని తోసేస్తాడు హీరో నాని.
సినిమాలో ఈ సీన్ హైలైట్ గా నిలిచింది. మనుషులంతా ఒక్కటే అని.. తాగే నీటికి, పీల్చే గాలికి జాతి, మతంతో సంబంధం లేదని మెసేజ్ ఇచ్చే సీన్ అది. ఈ సీన్ కోసం నిర్మాతలు ఎంత ఖర్చు చేశారో తెలుసా..? రూ.20 వేలు. బావి కోసం చిన్న సెట్ వేసి, ఆర్ట్ వర్క్ తో సీజీని కలిపి చాలా నేచురల్ గా సీన్ వచ్చేలా చిత్రీకరించారు.
అల్లు అర్జున్ రేంజ్ కాబట్టి రూ.2 కోట్లు ఖర్చు చేశారు. నాని సినిమా బడ్జెట్ ముప్పై కోట్ల లోపే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో మరింత ఇంపాక్ట్ గా సీన్ యూ డిజైన్ చేశారు. ఏది ఏమైనా.. ఈ బావి కాన్సెప్ట్ మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…