మన దర్శకనిర్మాతలు సినిమా సెట్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ విషయంలో ఆర్ట్స్ డైరెక్టర్స్ తెలివిగా ఆలోచిస్తే.. ఓ కోట్ల ఖర్చుని తగ్గించుకోవచ్చు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కలను స్మగుల్ చేసే పాత్రలో కనిపించాడు. సినిమా మొదలైన కాసేపటికే గంధపు చెక్కలున్న లారీను హీరో బావిలోకి నెట్టేస్తాడు. ఈ ఒక్క సీన్ కోసం నిర్మాతలు ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.
ఈ ఒక్క సీన్ కోసం ప్రత్యేకంగా బావిని తవ్వారట. సీన్ రియలిస్టిక్ గా రావడం కోసం మొత్తం రెండు కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి నిర్మాతలు ఒక్క సీన్ కోసం అంత ఖర్చు పెట్టారు. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కూడా ఓ బావి సీన్ ఉంటుంది గుర్తుందా..? అంటరానితనం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు బ్రాహ్మణులు వాడే నీటి బావిలోకి ఒక దళితుడిని తోసేస్తాడు హీరో నాని.
సినిమాలో ఈ సీన్ హైలైట్ గా నిలిచింది. మనుషులంతా ఒక్కటే అని.. తాగే నీటికి, పీల్చే గాలికి జాతి, మతంతో సంబంధం లేదని మెసేజ్ ఇచ్చే సీన్ అది. ఈ సీన్ కోసం నిర్మాతలు ఎంత ఖర్చు చేశారో తెలుసా..? రూ.20 వేలు. బావి కోసం చిన్న సెట్ వేసి, ఆర్ట్ వర్క్ తో సీజీని కలిపి చాలా నేచురల్ గా సీన్ వచ్చేలా చిత్రీకరించారు.
అల్లు అర్జున్ రేంజ్ కాబట్టి రూ.2 కోట్లు ఖర్చు చేశారు. నాని సినిమా బడ్జెట్ ముప్పై కోట్ల లోపే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో మరింత ఇంపాక్ట్ గా సీన్ యూ డిజైన్ చేశారు. ఏది ఏమైనా.. ఈ బావి కాన్సెప్ట్ మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం.
This post was last modified on January 27, 2022 5:50 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…