Movie News

‘పుష్ప’, ‘శ్యామ్ సింగరాయ్’.. ఓ బావి స్టోరీ!

మన దర్శకనిర్మాతలు సినిమా సెట్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ విషయంలో ఆర్ట్స్ డైరెక్టర్స్ తెలివిగా ఆలోచిస్తే.. ఓ కోట్ల ఖర్చుని తగ్గించుకోవచ్చు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కలను స్మగుల్ చేసే పాత్రలో కనిపించాడు. సినిమా మొదలైన కాసేపటికే గంధపు చెక్కలున్న లారీను హీరో బావిలోకి నెట్టేస్తాడు. ఈ ఒక్క సీన్ కోసం నిర్మాతలు ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. 

ఈ ఒక్క సీన్ కోసం ప్రత్యేకంగా బావిని తవ్వారట. సీన్ రియలిస్టిక్ గా రావడం కోసం మొత్తం రెండు కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి నిర్మాతలు ఒక్క సీన్ కోసం అంత ఖర్చు పెట్టారు. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కూడా ఓ బావి సీన్ ఉంటుంది గుర్తుందా..? అంటరానితనం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు బ్రాహ్మణులు వాడే నీటి బావిలోకి ఒక దళితుడిని తోసేస్తాడు హీరో నాని. 

సినిమాలో ఈ సీన్ హైలైట్ గా నిలిచింది. మనుషులంతా ఒక్కటే అని.. తాగే నీటికి, పీల్చే గాలికి జాతి, మతంతో సంబంధం లేదని మెసేజ్ ఇచ్చే సీన్ అది. ఈ సీన్ కోసం నిర్మాతలు ఎంత ఖర్చు చేశారో తెలుసా..? రూ.20 వేలు. బావి కోసం చిన్న సెట్ వేసి, ఆర్ట్ వర్క్ తో సీజీని కలిపి చాలా నేచురల్ గా సీన్ వచ్చేలా చిత్రీకరించారు. 

అల్లు అర్జున్ రేంజ్ కాబట్టి రూ.2 కోట్లు ఖర్చు చేశారు. నాని సినిమా బడ్జెట్ ముప్పై కోట్ల లోపే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో మరింత ఇంపాక్ట్ గా సీన్ యూ డిజైన్ చేశారు. ఏది ఏమైనా.. ఈ బావి కాన్సెప్ట్ మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం. 

This post was last modified on January 27, 2022 5:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

60 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago