భీమ్లా నాయక్ టెక్నికల్ టీం గురించి ప్రస్తావిస్తే ముందుగా అందరికీ గుర్తుకొస్తున్న పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్దే. మలయాళ బ్లాక్బస్టర్ అయ్యప్పనుం కోషీయుంకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. కానీ ఆయన పాత్ర స్క్రిప్టు వరకే పరిమితం కాలేదు. ఈ సినిమా చూసి రీమేక్ చేద్దామని నిర్మాతలు చినబాబు, నాగవంశీలకు చెప్పిందే త్రివిక్రమ్ అని.. అలాగే పవన్ను ఒప్పించి ఈ సినిమా చేయించింది కూడా ఆయనే అని అంటారు.
ఐతే సినిమాకు సన్నాహాలు చేయించడం, స్క్రిప్టు రాయడం వరకు పరిమితం కాకుండా.. ఆ తర్వాత కూడా మేకింగ్లో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పేరుకు మాత్రమే ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడని, త్రివిక్రమే అన్నీ తానై వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ సినిమా మేకింగ్ వీడియోలు చూసినా అదే ఫీలింగ్ కలుగుతోంది.
ఐతే బయటి వాళ్లు ఏమనుకున్నా.. యూనిట్ సభ్యులు సైతం సాగర్ చంద్రను దర్శకుడిగా గుర్తించకపోవడమే ఆశ్చర్యం. ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఓ టీవీ షోలో భాగంగా భీమ్లా నాయక్ గురించి మాట్లాడారు. ఆ ప్రస్తావన రాగానే త్రివిక్రమ్ గారు బెస్ట్ ఫిలిం అందించారు అన్నాడు. అలాగే ఆయనతో కలిసి సినిమా చూశానని.. ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందని.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది బెస్ట్ ఫిలిం అని కూడా చెప్పాడు.
ఈ చిత్రానికి తన వంతుగా ఏమాత్రం తగ్గకుండా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాన్నాడు. ఇప్పుడే కాదు.. ముందు కూడా భీమ్లా నాయక్ పేరెత్తితే త్రివిక్రమ్ గురించే మాట్లాడుతున్నాడు తమన్. అలా కాదంటే పవన్నామస్మరణ చేస్తాడు. కానీ దర్శకుడిగా సాగర్ చంద్రను మాత్రం గుర్తించి అతడి గురించి ఏమీ మాట్లాడట్లేదు. చూస్తుంటే ఈ సినిమా సక్సెస్ అయినా ఎవ్వరూ సాగర్ గురించి మాట్లాడేలా లేరు. క్రెడిట్ అంతా త్రివిక్రమ్ ఖాతాలోకే వెళ్లేలా ఉంది.
This post was last modified on January 24, 2022 10:31 am
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…