భీమ్లా నాయక్ టెక్నికల్ టీం గురించి ప్రస్తావిస్తే ముందుగా అందరికీ గుర్తుకొస్తున్న పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్దే. మలయాళ బ్లాక్బస్టర్ అయ్యప్పనుం కోషీయుంకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. కానీ ఆయన పాత్ర స్క్రిప్టు వరకే పరిమితం కాలేదు. ఈ సినిమా చూసి రీమేక్ చేద్దామని నిర్మాతలు చినబాబు, నాగవంశీలకు చెప్పిందే త్రివిక్రమ్ అని.. అలాగే పవన్ను ఒప్పించి ఈ సినిమా చేయించింది కూడా ఆయనే అని అంటారు.
ఐతే సినిమాకు సన్నాహాలు చేయించడం, స్క్రిప్టు రాయడం వరకు పరిమితం కాకుండా.. ఆ తర్వాత కూడా మేకింగ్లో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పేరుకు మాత్రమే ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడని, త్రివిక్రమే అన్నీ తానై వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ సినిమా మేకింగ్ వీడియోలు చూసినా అదే ఫీలింగ్ కలుగుతోంది.
ఐతే బయటి వాళ్లు ఏమనుకున్నా.. యూనిట్ సభ్యులు సైతం సాగర్ చంద్రను దర్శకుడిగా గుర్తించకపోవడమే ఆశ్చర్యం. ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఓ టీవీ షోలో భాగంగా భీమ్లా నాయక్ గురించి మాట్లాడారు. ఆ ప్రస్తావన రాగానే త్రివిక్రమ్ గారు బెస్ట్ ఫిలిం అందించారు అన్నాడు. అలాగే ఆయనతో కలిసి సినిమా చూశానని.. ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందని.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది బెస్ట్ ఫిలిం అని కూడా చెప్పాడు.
ఈ చిత్రానికి తన వంతుగా ఏమాత్రం తగ్గకుండా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాన్నాడు. ఇప్పుడే కాదు.. ముందు కూడా భీమ్లా నాయక్ పేరెత్తితే త్రివిక్రమ్ గురించే మాట్లాడుతున్నాడు తమన్. అలా కాదంటే పవన్నామస్మరణ చేస్తాడు. కానీ దర్శకుడిగా సాగర్ చంద్రను మాత్రం గుర్తించి అతడి గురించి ఏమీ మాట్లాడట్లేదు. చూస్తుంటే ఈ సినిమా సక్సెస్ అయినా ఎవ్వరూ సాగర్ గురించి మాట్లాడేలా లేరు. క్రెడిట్ అంతా త్రివిక్రమ్ ఖాతాలోకే వెళ్లేలా ఉంది.
This post was last modified on January 24, 2022 10:31 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…