పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దర్శకులకు డెడ్ లైన్ విధించినట్లు సమాచారం. అన్ని సినిమాలకు రెండేసి నెలలే కాల్షీట్స్ ఇస్తారట. అసలు విషయంలోకి వస్తే.. 2024లో ఎన్నికలు జరగనున్నాయి. 2023లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వనున్నారు. ఒక్కసారి అటువైపు వెళ్తే.. మళ్లీ సినిమాలకు సమయం కేటాయించలేకపోవచ్చు.
అందుకే తన చేతుల్లో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ‘భీమ్లానాయక్’ సినిమా దాదాపుగా పూర్తయినట్లే. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా సగం పూర్తయింది. ఈ సినిమాకి మరో నలభై రోజులు కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంది. అందుకే మరో షెడ్యూల్ లో మొత్తం సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు .
ఆ తరువాత హరీష్ శంకర్ సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమాకి పవన్ 60 రోజులు కాల్షీట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రెండు నెలల్లో సినిమాను పూర్తి చేయాలని ఇప్పటికే హరీష్ కి చెప్పినట్లు తెలుస్తోంది. వేగంగా సినిమాలను పూర్తి చేయడంలో హరీష్ కి మంచి అనుభవం ఉంది. మరి పవన్ సినిమాను కూడా అంతే వేగంగా పూర్తి చేస్తారేమో చూడాలి.
ఇక సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు పవన్. ఆ సినిమా కూడా రెండు నెలల్లో పూర్తి చేసేయాలని టార్గెట్ పెట్టారట పవన్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అది పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఈలోగా పవన్ క్రిష్, హరీష్ శంకర్ ల సినిమాలు పూర్తి చేస్తారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి సెట్స్ పైకి వస్తారు. మొత్తానికి ఈ ఏడాదిలో మూడు సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు పవన్. మరి అనుకున్నట్లుగా టైంకి సినిమాలు పూర్తవుతాయో లేదో చూడాలి!
This post was last modified on January 23, 2022 11:30 am
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…