పామును చూసి భయపడని వాళ్ల శాతం ఈ ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని చూడగానే నిలువెల్లా వణికిపోయే వాళ్లే ఎక్కువమంది. ఫొటోలు, వీడియోల్లో కూడా పామును చూడ్డానికి భయం వేస్తుంది చాలామందికి. తెర మీద వీర విన్యాసాలు చేసే హీరోలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా పాములంటే చాలా చాలా భయమట.
హైదరాబాద్ కేబీఆర్ పార్కులో ఒక పామును చూసి తాను ఎంతగా భయపడిపోయానో నందమూరి బాలకృష్ణ నిర్వహించే అన్ స్టాపబుల్ టాక్ షోలో మహేష్ బాబు వివరించాడు. ఈ షో లాస్ట్ ఎపిసోడ్కు మహేష్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అతడికి సన్నిహితుడైన దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఫిబ్రవరి 1న ఈ ఎపిసోడ్కు ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ పాము ఎపిసోడే హైలైట్గా నిలిచింది.
కేబీఆర్ పార్కులో ఒకసారి జాగింగ్ కోసం వెళ్లిన తాను.. మొత్తం పార్కును ఒక రౌండేసి రాగా.. ఎదురుగా ఒక పెద్ద పాము పడగ విప్పి కనిపించిందని.. దాన్ని చూడగానే భయపడిపోయిన తాను.. తాను వచ్చిన దారిలోనే వెనక్కి నాలుగు కిలోమీటర్లు పరుగెత్తుకుని వెళ్లిపోయానని.. మళ్లీ జీవితంలో కేబీఆర్ పార్కు ముఖం చూడలేదని చెప్పాడు. ఇక షూటింగ్ టైంలో తనకు ఎదురైన మరో ఆశ్చర్యకర అనుభవం గురించి మహేష్ ఇందులో గుర్తు చేసుకున్నాడు. భరత్ అనే నేను షూటింగ్లో భాగంగా ఒక ఇంటెన్స్ సీన్లో తాను సీరియస్గా డైలాగ్ చెబుతుంటే ఎదురుగా ఉన్న ఒకావిడ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కనిపించిందని, అది చూసి కోపం వచ్చి ఫోన్ ఆపేయమన్నానని.. అదే బాలయ్య అయితే మైక్ తీసి ఆమె మీద వేసేవారని మహేష్ చమత్కరించడం విశేషం.
ఇక వెయ్యిమందికి పైగా పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించడానికి పురిగొల్పిన కారణాన్ని కూడా ఈ షోలో మహేష్ వెల్లడించాడు. తన కొడుకు గౌతమ్ ఆరు వారాల ముందే పుట్టాడని.. అప్పుడతను తన అరచేయంతే ఉన్నాడని, ఇప్పుడు ఆరడుగులయ్యాడని.. తన దగ్గర డబ్బుంది కాబట్టి అవసరమైన వైద్యం చేయించుకోగలిగానని.. డబ్బు లేని వాళ్ల పరిస్థితేంటని ఆలోచించి ఈ సేవకు శ్రీకారం చుట్టినట్లు మహేష్ తెలిపాడు.
This post was last modified on January 21, 2022 9:11 pm
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…