ఓ భాషలో వచ్చిన సినిమాని ఎంతో ఖర్చుపెట్టి, కష్టపడి మరో భాషలో రీమేక్ చేస్తున్నప్పుడు.. అదే సినిమాని డబ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎంతో కొంత నష్టమైతే వస్తుంది. అందుకే ‘షెహ్జాదా’ మేకర్స్ కంగారుపడ్డారు. కాకపోతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంతో నష్టాన్ని తప్పించుకున్నారు.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఈ సినిమాని హిందీలో ‘షెహ్జాదా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. రోహిత్ ధావన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అమన్ గిల్, భూషణ్ కుమార్లతో కలిసి రీమేక్ చేస్తున్నారు అల్లు అరవింద్. కార్తీక్ ఆర్యన్ హీరో. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నవంబర్ 4న విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు.
అయితే ఈ మూవీ డబ్బింగ్ హక్కులు ఆల్రెడీ మనీష్ షాకి చెందిన గోల్డ్మైన్స్ సంస్థ తీసుకుంది. రీసెంట్గా పుష్ప మూవీ బాలీవుడ్లో కూడా సూపర్ హిట్ కావడంతో, బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ వెర్షన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు షా. ఆ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు.
కానీ ఇది తమ సినిమాకి మంచిది కాదని ‘షెహ్జాదా’ నిర్మాతలు ఫీలయ్యారు. అందుకే ఆ సంస్థతో మాట్లాడి రిలీజ్ని ఆపారు. ఇదంతా అల్లు అరవింద్ చేతుల మీదుగా జరిగినట్లు తెలుస్తోంది. ఏదేమైతేనేం.. షెహ్జాదాకి లైన్ క్లియరయ్యింది. లేదంటే ‘పుష్ప’ సృష్టించిన సెన్సేషన్ పుణ్యమా అని దీని ఎఫెక్ట్ కచ్చితంగా రీమేక్ మీద పడి ఉండేది.
This post was last modified on January 21, 2022 6:10 pm
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…
ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…