Movie News

బెల్లంకొండ డ్రాప్?


సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని నిజానికి ఎన్టీఆర్ చేయాలనుకున్నారు. కానీ ఈలోపే కృష్ణ ఆ కథతో సినిమా చేశాడు. సూపర్ హిట్ కొట్టాడు. ఈ విషయంలో అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణలకు విభేదాలు కూడా వచ్చినట్లు చెబుతారు. ఆ తర్వాత కూడా ఇలా ఒకే కథతో రెండు సినిమాల వివాదాలు లేకపోలేదు. ఈ మధ్య అలాంటి వివాదమే ఒకటి టాలీవుడ్లో తలెత్తింది.

ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో దోపిడీలతో హడలెత్తించిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఇంతకుముందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘స్టువర్టుపురం దొంగ’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేఎస్ అనే దర్శకుడితో శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ సినిమాను ప్రకటించారు. ఐతే ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన కొన్ని రోజులకు ఇదే కథతో ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిలే పెట్టి రవితేజ ప్రధాన పాత్రలో సినిమాను ప్రకటించారు. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాల దర్శకుడు వంశీ ఆకెళ్ల దీనికి డైరెక్టర్. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. దీంతో ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలేంటి అన్న ప్రశ్న తలెత్తింది. వీటిలో ఏదో ఒకటి డ్రాప్ కాక తప్పదేమో అన్న సందేహాలు కలిగాయి.

ఇప్పుడు ఆ సందేహాలే నిజమైనట్లు వార్తలొస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రకటించిన ‘స్టువర్టుపురం దొంగ’ చిత్రాన్ని ఆపేస్తున్నారట. రవితేజతో ప్రకటించిన సినిమా స్కేల్ పెద్దది కావడం.. దానికి స్క్రిప్టు కూడా బాగా వచ్చిందన్న సమాచారం ఉండటం.. పైగా శ్రీనివాస్ హిందీ ‘ఛత్రపతి’తో బిజీగా ఉండటంతో రవితేజే ముందు తన సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తుండటం.. ‘స్టువర్టుపురం దొంగ’ చిత్రాన్ని ఆపేయడమే మంచిదన్న నిర్ణయానికి ఆ చిత్ర బృందం వచ్చినట్లు సమాచారం. మరోవైపు రవితేజ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల్లో ఏదో ఒకటి హోల్డ్ చేసి అయినా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిసింది.

This post was last modified on January 21, 2022 2:33 pm

Share
Show comments

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

9 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

1 hour ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago