కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జైభీమ్’ సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా టాప్ రేటింగ్ సంపాదించింది. ఇండియన్ సినిమా స్థాయిలో పెంచిన చిత్రాల్లో ఇదొకటి అని గర్వంగా చెప్పొచ్చు. రీసెంట్ గానే ఈ సినిమాలో ఓ సన్నివేశాన్ని ప్రపంచ ప్రఖ్యాత అవార్డు సంస్థ ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసింది. ఇప్పటివరకు ఏ తమిళ సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు.
ఇప్పుడు ఏకంగా ‘జైభీమ్’ ఆస్కార్ 2022 అవార్డ్స్ కి బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి ఈరోజు ఆస్కార్ బరిలో నిలిచింది ‘జైభీమ్’.
తమ అభిమాన హీరో సినిమా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్య ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నారు. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు.
ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్’ కూడా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్ర అయిన కుంజలి మరక్కార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ‘మరక్కార్’కి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో చోటు దక్కించుకోవడం విశేషం.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…