Movie News

ఆస్కార్ బరిలో ‘జైభీమ్’, ‘మరక్కార్’!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జైభీమ్’ సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా టాప్ రేటింగ్ సంపాదించింది. ఇండియన్ సినిమా స్థాయిలో పెంచిన చిత్రాల్లో ఇదొకటి అని గర్వంగా చెప్పొచ్చు. రీసెంట్ గానే ఈ సినిమాలో ఓ సన్నివేశాన్ని ప్రపంచ ప్రఖ్యాత అవార్డు సంస్థ ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసింది. ఇప్పటివరకు ఏ తమిళ సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు.

ఇప్పుడు ఏకంగా ‘జైభీమ్’ ఆస్కార్ 2022 అవార్డ్స్ కి బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి ఈరోజు ఆస్కార్ బరిలో నిలిచింది ‘జైభీమ్’.

తమ అభిమాన హీరో సినిమా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్య ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నారు. టీజే జ్ఞానవేల్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు.

ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్’ కూడా ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్ర అయిన కుంజలి మరక్కార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ‘మరక్కార్’కి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో చోటు దక్కించుకోవడం విశేషం.

This post was last modified on January 21, 2022 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

20 minutes ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

1 hour ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago