నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలానే ‘అన్ స్టాపబుల్’ షోతో ఓటీటీలో కూడా తన సత్తా చాటుతున్నారు. హోస్ట్ గా బాలయ్యను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో హోస్ట్ చేసిన షోకి కూడా ఈ రేంజ్ లో రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. దాన్ని బట్టి బాలయ్య క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. బాలయ్యతో ఇలాంటి షో చేయాలనేది అల్లు అరవింద్ ఆలోచన.
ఆయన ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతోంది. అయితే ఇప్పుడు బాలయ్యతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. తన గీతాఆర్ట్స్ బ్యానర్ పై బాలయ్యను హీరోగా పెట్టి ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నారు. అల్లు అరవింద్ తో ఉన్న బాండింగ్ కారణంగా బాలయ్య ‘నో’ చెప్పే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ కాంబినేషన్ లో సినిమా రావడం పక్క అని చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
ప్రస్తుతం అల్లు అరవింద్ కొందరు దర్శకులతో డిస్కషన్స్ జరుపుతున్నాడట. ఒక్కసారి డైరెక్టర్ ఫిక్స్ అయితే వెంటనే సినిమాను అనౌన్స్ చేయాలని చూస్తున్నారు. గీతాఆర్ట్స్ లో ఎక్కువగా మెగాహీరోల సినిమాలనే నిర్మిస్తున్నారు. అప్పట్లో వరుసగా చిరంజీవితోనే సినిమాలు చేసేవారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలను నిర్మించారు.
ఈ మధ్యకాలంలో బయట హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యతో పెద్ద సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
This post was last modified on January 21, 2022 11:00 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…