అంతా అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు రాధేశ్యామ్ హంగామా నడుస్తుండాల్సింది థియేటర్లలో. సంక్రాంతి కానుకగా జనవరి 14కు షెడ్యూల్ అయిన ఈ చిత్రం కరోనా థర్డ్ వేవ్ విజృంభణతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమా మళ్లీ ఎప్పటికి థియేటర్లలోకి దిగుతుందో అర్థం కాని అయోమయంలో ఉన్నారు అభిమానులు.
వచ్చే రెండు నెలల్లోపు అయితే ఈ సినిమా రిలీజయ్యే సూచనలు కనిపించడం లేదు. ఫిబ్రవరి మీద ఎవరికీ ఆశల్లేవు. ఐతే మార్చి ప్రథమార్ధంలో కరోనా నియంత్రణలోకి వస్తుందంటూ నిపుణులు అంచనాలు వేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టి దేశవ్యాప్తంగా థియేటర్లు నడవడం మొదలైతే.. ఎక్కువ సమయం తీసుకోవద్దన్నది రాధేశ్యామ్ టీం ఉద్దేశమట.
ఏప్రిల్ మీద ఆశలు పెట్టుకుంటే సరైన డేట్ దొరకడం కష్టమని.. ఆర్ఆర్ఆర్ కూడా ఆ నెల చివర్లో వచ్చేందుకు చూస్తుండటం, మధ్యలో కేజీఎఫ్-2 రావాల్సి ఉండటంతో రాధేశ్యామ్కు అవకాశం దక్కడం కష్టమే. వేసవికి భారీ చిత్రాలు చాలానే షెడ్యూల్ అయి ఉండటంతో సరైన డేట్ కోసం చూస్తూ పోతే సినిమా మరింత ఆలస్యమవుతుందని.. అందుకే పరిస్థితులు కాస్త సానుకూలంగా మారగానే ఆలస్యం చేయకుండా సినిమాను రిలీజ్ చేసేయాలని యువి క్రియేషన్స్ వాళ్లు చూస్తున్నారట.
హిందీ సినిమాలేవీ కూడా మార్చిలో రిలీజ్ చేసే సాహసాలు చేయకపోవచ్చని.. తెలుగులో కూడా మీడియం సినిమాలే వచ్చే ఛాన్సుందని.. కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను వదిలేయొచ్చని అనుకుంటున్నారట. కానీ దీనికి కూడా షరతులు వర్తించును అనుకోవాల్సిందే. కరోనా తగ్గుముఖం పట్టకుండా, థియేటర్లు మూతపడి ఉంటే మాత్రం రాధేశ్యామ్ టీం చేయడానికేమీ ఉండదు.
This post was last modified on January 21, 2022 1:15 am
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…