ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల గురించి కొన్ని నెలలుగా ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. దీని వల్ల టాలీవుడ్లో అందరు నిర్మాతలూ ఇబ్బంది పడుతున్నారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మామూలుగానే ఏపీలో టికెట్ల రేట్లు తక్కువంటే.. వాటిని కూడా తగ్గించి ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెట్టింది జగన్ సర్కారు. దీనిపై ఎవరు నోరెత్తినా వాళ్ల నోళ్లకు తాళాలు వేయించే పనే జరుగుతోంది. టార్గెట్ చేస్తున్నారు. మాట్లాడే వాళ్లను కూడా మాట్లాడొద్దంటూ ఇండస్ట్రీ వైపు నుంచే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు కూడా ఈ అంశంపై ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదు. జగన్ తనకు బావ అంటూ గొప్పగా చెప్పుకునే విష్ణు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో వెళ్లి ఏపీ సీఎంతో మాట్లాడొచ్చు కదా అనే ప్రశ్నలు తరచుగా వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ కూడా జరిగింది.
తాజాగా గురువారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని మీడియాను కలిసి సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు, విష్ణుకు సన్నిహితుడు కూడా అయిన నరేష్ను విలేకరులు ఈ విషయమై ప్రశ్నించారు. మంచు విష్ణు ఈ విషయమై ఎందుకు మాట్లాడట్లేదని అడిగారు. దీనికి నరేష్ బదులిస్తూ.. ఈ విషయంలో మంచు విష్ణు జోక్యం అనవసరమని, అతను చేస్తున్నదాంట్లో తప్పేమీ లేదని అన్నాడు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే ఒక స్వతంత్ర సంస్థ అని.. దాని బాధ్యత అంతా నటీనటుల యోగక్షేమాలు చూడటం వరకే పరిమితం అని.. పరిశ్రమకు సంబంధించిన ఇతర విషయాలతో దానికి సంబంధం లేదని నరేష్ తేల్చేశాడు. టికెట్ల ధరల అంశం ఫిలిం ఛాంబర్ పరిధిలో ఉందని, చిరంజీవి ఇటీవలే ఏపీ సీఎంను కలిసి చర్చించారని.. కాబట్టి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిద్దామని నరేష్ వ్యాఖ్యానించాడు. దీనిపై వ్యక్తిగతంగా తానేమీ మాట్లాడలేనని, తాను ఈ అంశాన్ని ఫాలో కాలేదని ఆయనన్నాడు.
This post was last modified on January 20, 2022 10:27 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…