తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు.. హీరో క్యారెక్టర్లను డామినేట్ చేసే సందర్భాలు చాలా తక్కువే. విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్లు అంత బాగా ఎలివేట్ అవుతాయన్న సూత్రం వాస్తవమే అయినా.. దాన్ని పాటించే దర్శకులు తక్కువ. ఎంతసేపూ హీరో పాత్రల్ని ఎలివేట్ చేయడానికే చూస్తారు. విలన్లను జోకర్లను చేసి హీరోలు ఆడుకునే సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి.
తన కెరీర్లో కూడా అలాంటి విలన్ పాత్రలు చాలా చేశానని.. కానీ కొన్ని చిత్రాల్లో మాత్రం తాను చేసిన నెగెటివ్ రోల్స్ చాలా బాగా వచ్చాయని చెప్పారు సీనియర్ నటుడు జగపతి బాబు. అలాంటి పాత్రల్లో ‘అరవింద సమేత’లోని బసిరెడ్డి క్యారెక్టర్ ఒకటన్నారాయన. ఈ పాత్ర విషయంలో తారక్కు తన మీద చాలా కోపం వచ్చిందని.. షూటింగ్ టైంలో తనపై కసినంతా తీర్చుకున్నాడని.. అంతే కాక నాలుగైదేళ్లు మీ మొహం నాకు చూపించొద్దు అన్నాడని కూడా జగపతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘అరవింద సమేత’లో తాను చేసిన బసిరెడ్డి పాత్ర చాలా అగ్రెసివ్గా ఉంటుందని.. తారక్ పాత్ర ప్యాసివ్గా ఉంటుందని.. సినిమా అంతా తనదే డామినేషన్ అని.. ఇలాంటి పాత్రను తారక్ స్థాయిలో ఉన్న స్టార్ హీరో ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు జగపతి. షూటింగ్ టైంలో కూడా తన పాత్ర డామినేషన్ చూసి రోజూ రాత్రి ఫోన్ చేసి తారక్ తనను సరదాగానే తిట్టేవాడని జగపతిబాబు చెప్పారు.
నువ్వు తారక్నే డామినేట్ చేస్తున్నావ్ అంటూ.. ఇంకో నాలుగైదేళ్లు మొహం నాకు మొహం చూపించొద్దు, నేను మీతో నటించను అని తారక్ అన్నట్లు జగపతి వెల్లడించారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా తన పాత్ర డామినేషన్ గురించి తారక్ ప్రస్తావించాడని.. సినిమా చూశాక ప్రేక్షకులకు తన క్యారెక్టర్ కంటే బసిరెడ్డి పాత్రే గుర్తుంటుందని.. అలా మాట్లాడటం తారక్ గొప్పదనం అని అన్నారు జగపతి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…