అందం.. నటన.. ఇలా దేన్ని వంక పెట్టే అవసరం లేనప్పటికీ.. తీసుకున్న నిర్ణయాలు.. వేసిన తప్పటడుగులు హీరోయిన్ అమలాపాల్ కెరీర్ ను.. వ్యక్తిగత జీవితాన్ని ఎంతలా డిస్ట్రబ్ చేశాయో తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యల్ని చేసేందుకు ఏ మాత్రం వెనుకాడని ఆమె.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగినా.. అదెక్కువ కాలం నిలవలేదు. సౌత్ లో వెలుగులు చిమ్మిన అమలాపాల్.. చాలా తర్వగానే తన స్టార్ డమ్ ను కోల్పోయారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో స్టార్ హీరోల పక్కన చాన్సుల్ని సొంతం చేసుకున్న ఈ డస్కీ బ్యూటీ.. చాలా తక్కువ వ్యవధిలోనే తన కెరీర్ గ్రాఫ్ ను పడేసుకున్నారు.
అప్పుడప్పుడు సినిమా అవకాశాన్ని సొంతం చేసుకుంటున్న అమలాపాల్.. తాజాగా వెబ్ సిరీస్ లను చేస్తూ.. తన ఉనికిని చాటి చెబుతోంది. ఆ మధ్య తెలుగులో కుడి ఎడమైతే వెబ్ సిరీస్ లో నటించిన ఆమె.. తాజాగా హిందీలో ‘రంజిష్ హీ సహీ’ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
ఈ రోజు వూట్ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి ట్రైలర్ ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సిరీస్ తో అమలాపాల్ కు మరింత గుర్తింపు వస్తుందని చెబుతున్నారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ నిర్మాత మహేశ్ భట్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా నిర్మించిన ఈ సిరిసీ్ లో నటి పర్విన్ బాబీ పాత్రలో అమలపాల్ ఒదిగిపోయినట్లు చెబుతుననారు. మద్యానికి.. సిగిరెట్ కు బానిస అయిన స్టార్ నటిగా ఇందులో కనిపించనున్న అమలాపాల్.. లిప్ లాక్ లతో హోరెత్తించిందని చెబుతున్నారు.
ఈ వెబ్ సిరీస్ యాబై శాతం మహేశ్ భట్ జీవితమని.. మరికొంత ఫిక్షన్ కలిపి తీసినట్లుగా తాహిర్ రాజ్ బసీన్ చెబుతున్నాడు. ఇతడు ఎవరంటే.. ఈ సిరీస్ లోమహేశ్ భట్ పాత్రను పోషిస్తున్నాడు. ఇతడు వెంటనే గుర్తుకు రావాలంటే..ఈ మధ్యనే విడుదలైన ‘83’ మూవీలో సునీల్ గవాస్కర్ పాత్రను పోషించాడు. ఈ సిరీస్ తో అమలాపాల్ లోని నటి మాత్రమే కాదు..ఆమెలో గ్లామర్ పాళ్లు తగ్గలేదన్న విషయాన్ని చాటి చెబుతుందని చెబుతున్నారు. ఆమెకు ఈ సిరీస్ గుర్తింపు తెచ్చి పెట్టటమే కాదు.. మరిన్ని అవకాశాల్ని ఇస్తుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on January 13, 2022 1:41 pm
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…