Movie News

ఏపీ టికెట్ల సమస్యపై బాలయ్య హాట్ కామెంట్స్


ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రధాన సమస్య అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల వ్యవహారమే. గత ఏడాది వేసవిలో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’కు రేట్లను తగ్గించిన ఏపీ ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా అవే రేట్లను కొనసాగించడం తెలిసిందే. పెద్ద నగరాలు, పట్టణాల వరకు ఓకే కానీ.. మిగతా చోట్ల ప్రభుత్వం నిర్దేశించిన రేట్లతో థియేటర్లను నడపడం చాలా కష్టమవుతోందన్న అభిప్రాయం ఎగ్జిబిటర్ల నుంచి వ్యక్తమవుతోంది.

ఈ సమస్య పరిష్కారానికి ఇండస్ట్రీ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటిదాకా పరిష్కారం ఏమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి కొన్ని నిరసన గళాలు కూడా వినిపిస్తున్నాయి. నాని సహా కొందరి కామెంట్లు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ విషయమై హాట్ కామెంట్స్ చేశారు.

తన కొత్త చిత్రం ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో పాల్గొన్న బాలయ్యకు ఏపీలో టికెట్ల వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి బదులుగా ఈ విషయంలో సినీ పరిశ్రమ మొత్తం కలిసి కట్టుగా ఉండటం అవసరమని బాలయ్య వ్యాఖ్యానించాడు. టికెట్ ధరలపై చిత్ర పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని అన్నాడు.

ఏపీలో టికెట్ల వ్యవహారంపై సినీ పరిశ్రమ నుంచి సరైన రెప్రజెంటేషన్ లేకపోవడమే సమస్యగా మారిందా అని బాలయ్యను అడిగితే.. అక్కడ వినిపించుకునే నాథుడెక్కడ అని ఎదురు ప్రశ్నించారు బాలయ్య. ఈ వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి బాలయ్య వ్యాఖ్యలపై సినిమాటోగ్రఫీ పేర్ని నాని సహా మంత్రులు, వైకాపా నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం. నానీని టార్గెట్ చేసినట్లే బాలయ్యను కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడతారేమో చూడాలి.

This post was last modified on January 12, 2022 5:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago