ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ‘హీరో’ సినిమా ఒకటి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సినిమాలో చాలా మంది పేరున్న నటీనటులు ఉన్నారు.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ ను క్వాలిటీతో చిత్రీకరించారు. ఇదిలా ఉండగా.. ఈ కథ ముందుగా చాలా మంది యంగ్ హీరోల దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నితిన్ హీరోగా ఈ సినిమా చేయాలనుకున్నారట శ్రీరామ్ ఆదిత్య. దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా జరిగాయట.
నితిన్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు కానీ ప్రాజెక్ట్ చేతులు మారింది. ఫైనల్ గా ‘హీరో’ స్టోరీ అశోక్ గల్లా దగ్గరకు వచ్చింది. ఎప్పటికైనా సినిమా హీరో అవ్వాలని కలలు కనే ఓ కుర్రాడు.. సడెన్ గా ఓ మర్డర్ మిస్టరీలో చిక్కుకుంటాడు. ఆ మర్డర్ స్టోరీ ఏంటి..? దాని నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీ.
ట్రైలర్ లో కథ చెప్పకుండా జాగ్రత్త పడినప్పటికీ.. మెయిన్ ప్లాట్ ఇదేనని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రెండు, మూడు కామెడీ ఎపిసోడ్స్ లో రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.
ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ఓ ట్రాక్ ను పెట్టారట. అది చూస్తున్నంతసేపు ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారని చాలా నమ్మకంగా చెబుతున్నారు. మరి తన మొదటి సినిమాతో అశోక్ గల్లా ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
This post was last modified on January 12, 2022 1:13 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవడం సవాలుగా మారింది. తెలుగులో…
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…