ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ‘హీరో’ సినిమా ఒకటి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సినిమాలో చాలా మంది పేరున్న నటీనటులు ఉన్నారు.
రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్ ను క్వాలిటీతో చిత్రీకరించారు. ఇదిలా ఉండగా.. ఈ కథ ముందుగా చాలా మంది యంగ్ హీరోల దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నితిన్ హీరోగా ఈ సినిమా చేయాలనుకున్నారట శ్రీరామ్ ఆదిత్య. దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా జరిగాయట.
నితిన్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు కానీ ప్రాజెక్ట్ చేతులు మారింది. ఫైనల్ గా ‘హీరో’ స్టోరీ అశోక్ గల్లా దగ్గరకు వచ్చింది. ఎప్పటికైనా సినిమా హీరో అవ్వాలని కలలు కనే ఓ కుర్రాడు.. సడెన్ గా ఓ మర్డర్ మిస్టరీలో చిక్కుకుంటాడు. ఆ మర్డర్ స్టోరీ ఏంటి..? దాని నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీ.
ట్రైలర్ లో కథ చెప్పకుండా జాగ్రత్త పడినప్పటికీ.. మెయిన్ ప్లాట్ ఇదేనని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రెండు, మూడు కామెడీ ఎపిసోడ్స్ లో రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.
ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ఓ ట్రాక్ ను పెట్టారట. అది చూస్తున్నంతసేపు ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారని చాలా నమ్మకంగా చెబుతున్నారు. మరి తన మొదటి సినిమాతో అశోక్ గల్లా ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…