ప్రతి భాషలోనూ బోలెడన్ని బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. కానీ ఏ బయోపిక్కీ జరగని రచ్చ ఓ మూవీ విషయంలో జరిగింది. అదే.. 800. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీయాలనుకున్నాడు ఎమ్మెస్ శ్రీపతి. ముత్తయ్య పాత్రకి విజయ్ సేతుపతిని తీసుకున్నాడు. కానీ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. దానికి కారణం కూడా చాలా బలమైనది.
అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు మేకర్స్. అది చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. ముత్తయ్యలా కనిపించడానికి ఎంతో అద్భుతంగా మేకోవర్ అయ్యాడు సేతుపతి. అతనినే చూస్తున్నామా అనిపించేంతగా మారిపోయాడు. ఆ పాత్రకి తనే పర్ఫెక్ట్ అని ప్రతి సినీ లవర్ అనుకున్నాడు. కానీ యాంటీ తమిళ్ స్టాండ్ తీసుకున్న ముత్తయ్య జీవితాన్ని సినిమాగా తీయడానికి వీల్లేదంటూ కొందరు కాంట్రవర్శీకి తెర తీశారు.
విజయ్ సేతుపతికి కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అచ్చమైన తమిళియన్ అయ్యుండి, తమిళులను వ్యతిరేకించిన వ్యక్తి పాత్రలో నటిస్తావా అంటూ ఘాటుగా విమర్శించారు. చంపేస్తామని బెదిరించారు కూడా. విషయం తన కుటుంబ సభ్యుల వరకు వస్తూ ఉండటంతో, ఆ ఒత్తిడికి తట్టుకోలేక సేతుపతి తప్పుకున్నాడు. తాను ఆ పాత్ర చేయడం లేదని ప్రకటించాడు. అయితే సేతుపతి వదిలేసినా దర్శకుడు ప్రాజెక్ట్ని వదల్లేదు. మరో నటుడితో సినిమా తీయాలని ఫిక్సయ్యాడు.
‘స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్తో ‘800’ మూవీని తీసేందుకు శ్రీపతి ఏర్పాట్లు చేస్తున్నాడని కోలీవుడ్ టాక్. దేవ్కి మంచి ఫాలోయింగ్ ఉంది. హోటల్ ముంబై, ద వెడ్డింగ్ గెస్ట్, ద గ్రీన్ నైట్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్గా ఒక ఓటీటీ కోసం దర్శకుడిగా మారాడు. ఓ మూవీని డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్ చేస్తున్నాడు. ముత్తయ్య పాత్ర చేయడానికి అతను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దేవ్ లండన్లో సెటిలైన గుజరాతీ కుటుంబంలో పుట్టాడు. కాబట్టి ఈ పాత్ర చేయడంలో తనకెలాంటి సమస్యలూ రావు. కాకపోతే సమస్యంతా ముత్తయ్యతోనే. అతనంటేనే వ్యతిరేకతతో ఉన్న తమిళులు మరోసారి సినిమాని అడ్డుకోరా అనేదే పెద్ద ప్రశ్న.
This post was last modified on January 12, 2022 8:10 am
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…