హీరోయిన్లకి రెమ్యునరేషన్ విషయంలో అన్యాయం జరుగుతోంది అనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. హీరోలతో సమానంగా ఇవ్వకపోయినా, తమ కష్టానికి తగిన ఫలితం ఉండాలంటూ చాలామంది హీరోయిన్లు ఇప్పటికే డిమాండ్ చేశారు. ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు తాము కోరినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో సౌత్లో నయనతార, నార్త్లో ఆలియాభట్లు మొదటి స్థానాల్లో ఉన్నారు.
‘గాడ్ఫాదర్’ మూవీలో చిరంజీవికి చెల్లెలిగా నటించడానికి నయనతార నాలుగు కోట్లు అడిగిందని తెలియగానే అందరూ షాకైపోయారు. దాని గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. ఎందుకంటే మన దగ్గర అది చాలా పెద్ద అమౌంట్. అందులోనూ హీరోయిన్కి అంత ఇవ్వడం అనేది నిజంగా విశేషమే. ఇక నార్త్లో ఆలియా గురించి కూడా అలాగే చెప్పుకుంటున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘గంగూబాయ్ కథియావాడి’ మూవీ కోసం ఆలియా ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందనే విషయం తాజాగా బైటికి వచ్చింది. దాంతో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. ఈ మూవీతో పాటు ఆలియా నటించిన ఆర్ఆర్ఆర్ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. ఇంకా బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్కహానీ, డార్లింగ్స్ లాంటి భారీ చిత్రాలున్నాయి తన చేతిలో.
అందుకే ఆమె డిమాండ్కి ఆమాత్రం పే చేయడంలో తప్పు లేదని కొందరు అంటుంటే.. అమ్మో అంతిచ్చారా అంటూ మిగతావాళ్లు ఆశ్చర్యపోతున్నారు. పదిహేను నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సీత పాత్రకి ఆలియా ఐదు కోట్లు తీసుకుందనే టాక్ కూడా ఆమధ్య వినిపించింది. అలా చూసుకుంటే ‘గంగాబాయ్’కి ఇరవై కోట్లు పెద్ద విషయమేమీ కాదు మరి.
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…