హీరోయిన్లకి రెమ్యునరేషన్ విషయంలో అన్యాయం జరుగుతోంది అనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. హీరోలతో సమానంగా ఇవ్వకపోయినా, తమ కష్టానికి తగిన ఫలితం ఉండాలంటూ చాలామంది హీరోయిన్లు ఇప్పటికే డిమాండ్ చేశారు. ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు తాము కోరినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో సౌత్లో నయనతార, నార్త్లో ఆలియాభట్లు మొదటి స్థానాల్లో ఉన్నారు.
‘గాడ్ఫాదర్’ మూవీలో చిరంజీవికి చెల్లెలిగా నటించడానికి నయనతార నాలుగు కోట్లు అడిగిందని తెలియగానే అందరూ షాకైపోయారు. దాని గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. ఎందుకంటే మన దగ్గర అది చాలా పెద్ద అమౌంట్. అందులోనూ హీరోయిన్కి అంత ఇవ్వడం అనేది నిజంగా విశేషమే. ఇక నార్త్లో ఆలియా గురించి కూడా అలాగే చెప్పుకుంటున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘గంగూబాయ్ కథియావాడి’ మూవీ కోసం ఆలియా ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందనే విషయం తాజాగా బైటికి వచ్చింది. దాంతో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. ఈ మూవీతో పాటు ఆలియా నటించిన ఆర్ఆర్ఆర్ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. ఇంకా బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్కహానీ, డార్లింగ్స్ లాంటి భారీ చిత్రాలున్నాయి తన చేతిలో.
అందుకే ఆమె డిమాండ్కి ఆమాత్రం పే చేయడంలో తప్పు లేదని కొందరు అంటుంటే.. అమ్మో అంతిచ్చారా అంటూ మిగతావాళ్లు ఆశ్చర్యపోతున్నారు. పదిహేను నిమిషాల నిడివి మాత్రమే ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సీత పాత్రకి ఆలియా ఐదు కోట్లు తీసుకుందనే టాక్ కూడా ఆమధ్య వినిపించింది. అలా చూసుకుంటే ‘గంగాబాయ్’కి ఇరవై కోట్లు పెద్ద విషయమేమీ కాదు మరి.
This post was last modified on January 11, 2022 7:39 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…