గత నెల 17వ తేదీన ‘పుష్ప’ సినిమా రిలీజైనపుడు సోషల్ మీడియాలో కనిపించిన నెగెటివిటీకి అందరూ షాకైపోయారు. సినిమాలో కొన్ని లోపాలున్నప్పటికీ ఆ స్థాయి నెగెటివిటీ ఊహించనిదే. ఇదొక పనికి రాని సినిమా అన్నట్లుగా అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేసింది ఓ వర్గం. న్యూట్రల్ ఆడియన్స్లోనూ ఈ సినిమా పట్ల కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కనిపించిన నెగెటివిటీ మాత్రం చాలా ఎక్కువ.
ఇంత కష్టపడి సినిమా తీస్తే ఈ నెగెటివిటీ ఏంటి అని దర్శకుడు సుకుమార్ సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. సినిమాకు వచ్చిన సమీక్షల విషయంలోనూ ఆయన బాధ పడ్డారట. ఐతే తన సినిమాలక మొదట్లో డివైడ్ టాక్ రావడం కామనే అని.. వాటిలో చాలా చిత్రాలు ఈ టాక్ను తట్టుకుని విజయవంతం అయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. చివరికి ఆయన నమ్మకమే నిలబడింది. బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప’ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడింది.
టికెట్ల ధరలు తక్కువగా ఉండటం వల్ల ఏపీలో కొంత మేర నష్టాలొచ్చాయి కానీ.. మిగతా అన్ని చోట్లా సినిమా సూపర్ హిట్గా నిలబడింది. దీనికి బాక్సాఫీస్ దగ్గర భలేగా కలిసొచ్చి లాంగ్ రన్తో భారీ షేర్ రాబట్టగలిగింది. సోషల్ మీడియాలో నెగెటివిటీ కూడా నెమ్మదిగా తగ్గిపోయింది. సినిమా నెగెటివిటీని తట్టుకుని నిలబడేసరికి అందరూ సైలెంటైపోయారు. హిందీ, తమిళం, మలయాళంలో ఈ సినిమా సాధించిన వసూళ్లు చూసి అంతా షాకయ్యారు. ఇతర భాషల నుంచి అంత అప్లాజ్ వస్తుంటే.. మనవాళ్లు ఇంకెక్కడ నెగెటివిటీ స్ప్రెడ్ చేయగలరు.
నెమ్మదిగా ‘పుష్ఫ’ మీదున్న నెగెటివిటీ అంతా పక్కకు పోయి ప్రశంసలే కురవడం మొదలైంది. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో వచ్చాక అందరూ ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్నారు. ఈ సినిమా గురించి మొదట్లో వచ్చిన నెగెటివ్ టాక్, కామెంట్లకు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు యునానమస్గా సినిమా సూపర్ అనే అభిప్రాయం ఓటీటీలో సినిమా చూసిన వారి నుంచి వ్యక్తమవుతుండటం విశేషం.
This post was last modified on January 9, 2022 9:02 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…