పరుగెత్తి పాలు తాగాలనుకునేవాళ్లే ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తుంటారు. నిలబడి నీళ్లు తాగుదామనుకునేవారు కొందరే ఉంటారు. కార్తి రెండో కేటగిరీకి చెందినవాడు. ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేసేద్దాం అనే తాపత్రయం కంటే, ఏం చేసినా కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దాం అనే యాటిట్యూడ్ ఎక్కువగా కనిపిస్తుంది తనలో. అదే తనని స్పెషల్గా నిలబెడుతోంది.
ప్రస్తుతం కార్తి చేస్తున్న సినిమాలను గమనిస్తే తన రూట్ ఎంత సెపరేట్ అనేది అర్థమవుతుంది. సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’కి సీక్వెల్ చేస్తున్నాడు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లో చోళ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ‘విరుమాన్’ మూవీలో యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు. ఇక ‘సర్దార్’ మరింత డిఫరెంట్. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు కార్తి. ఒకటి యంగ్ పాత్ర. రెండోది వయసు మీదపడిన క్యారెక్టర్.
రెండు రోల్స్ కోసం రెండు విధాలుగా మేకోవర్ అయ్యాడు కార్తి. ఓల్డేజ్ క్యారెక్టర్ని ఫస్ట్ లుక్ పోస్టర్తోనే రివీల్ చేశారు. రీసెంట్గా కొన్ని ఫొటోలు కూడా బైటికొచ్చాయి. ఇక లొకేషన్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో హ్యాండ్సమ్ యంగ్మేన్గా కనిపించాడు. ఈ రెండు లుక్స్లోనూ వహ్వా అనిపించేలా ఉన్నాడు కార్తి. ఇక తన అన్నయ్య సూర్యతో కలిసి కార్తి ఓ సినిమా చేయనున్నాడనే వార్త చాలాకాలంగా వినిపిస్తోంది. దాన్ని ఈ యేడు నిజం చేయనున్నారని కోలీవుడ్ టాక్. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్లో వీరిద్దరూ నటిస్తారని అన్నారు. ఈ మూవీ ఆల్రెడీ తెలుగులో ‘భీమ్లానాయక్’గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అంతకంటే ముందే తమిళ రీమేక్ గురించి చర్చలు మొదలయ్యాయి.
పవన్ చేస్తున్న పాత్రలో సూర్య, రానా చేస్తున్న పాత్రలో కార్తి కనిపిస్తారని అన్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత సూర్య చేయడం లేదని, ఆయన స్థానంలో పార్థిబన్ యాక్ట్ చేస్తాడని ప్రచారం జరిగింది. ఇంతవరకు వీటిలో ఏదీ వర్కవుట్ కాలేదు. అయితే కార్తి, సూర్య మాత్రం కలిసి నటించే ప్లాన్స్లోనే ఉన్నారట. రీమేక్ కాకుండా ఓ కొత్త స్క్రిప్ట్తో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య రెండు వరుస విజయాలు అందుకున్న జోష్లో ఉన్నాడు. ఇక కార్తి వెరైటీనే కోరుకుంటాడు. కాబట్టి కచ్చితంగా ఏదో మంచి ప్రాజెక్టే లైన్లో పెట్టే చాన్స్ ఉంది.
This post was last modified on January 8, 2022 3:38 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…